యాప్నగరం

ధోనీ ఇక చాలు.. రిటైర్మెంట్ గురించి ఆలోచించు: బిన్నీ

మహేంద్రసింగ్ ధోనీ గత ఏడాది జులై నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది వ్యవధిలో లెక్క‌కి మించి అతని రిటైర్మెంట్‌పై రూమర్స్ వినిపించాయి. కానీ.. మౌనమే ధోనీ సమాధానం..!

Samayam Telugu 1 Aug 2020, 6:15 pm
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ సెలక్టర్ రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ దూరమవగా.. అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి సెలక్టర్లు వరుసగా అవకాశాలిస్తున్నారు. దాంతో.. ధోనీని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పించగా.. ఇక టీమిండియాకి అతను ఆడటం కష్టమేనని అభిప్రాయాలు వినిపించాయి. మొత్తంగా.. గత ఏడాదికాలంగా ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. కానీ.. అతను మాత్రం మౌనంగా ఉండిపోతున్నాడు.
Samayam Telugu MS Dhoni, Roger Binny
रोजर बिनी ने उठाए सवाल


ధోనీ రిటైర్మెంట్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ ‘‘ధోనీ చివరి రెండు సీజన్ల ప్రదర్శనతో పోలిస్తే.. గతంలో చాలా అద్భుతమైన ఆటతీరుని కనబర్చాడని అర్థమవుతుంది. తన టాలెంట్, పవర్ హిట్టింగ్‌తో.. మ్యాచ్‌ల్ని మలుపు తిప్పడం, ఓడిపోయే మ్యాచ్‌ల్ని గెలిపించడంలో ధోనీకి తిరుగులేదు. కానీ.. ఇటీవల అతని ఫిట్‌నెస్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది. మరోవైపు యువ క్రికెటర్లు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ధోనీ గతం చాలా గొప్పది.. కానీ.. ఇప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించక తప్పదు’’ అని వెల్లడించాడు.

భారత్ జట్టుకి ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో సెలక్టర్లలో ఒకడిగా రోజర్ బిన్నీ ఉన్నాడు. సెలక్టర్లని టీమ్ గురించి ఒక కెప్టెన్‌గా ధోనీ ఎప్పుడూ డిమాండ్ చేసేవాడు కాదని చెప్పుకొచ్చిన బిన్నీ.. సీనియర్ క్రికెటర్లకి అతను చాలా గౌరవం ఇచ్చేవాడని కితాబిచ్చాడు. రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ.. టీమిండియాలోకి ఎంట్రీకి ఇచ్చినా.. ఎక్కువ రోజులు జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.