భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి వ్యతిరేకంగా మాట్లాడి షోకాజ్ నోటీసులు ఎదుర్కొనే వరకూ వెళ్లిన కోహ్లీ.. పర్యటన ఆఖరి మ్యాచ్లో జాతీయ గీతం పాడకుండా వివాదానికి తెరదీశాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్టౌన్ వేదికగా ఆదివారం ఆఖరి వన్డే జరగగా.. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (65: 84 బంతుల్లో 5x4) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కానీ.. భారత్ జట్టు ఆఖరికి 4 పరుగుల తేడాతో ఓడిపోయి.. మూడు వన్డేల సిరీస్లో 0-3తో వైట్వాష్కి గురైంది. కేప్టౌన్లో ఆదివారం ఆఖరి వన్డే ప్రారంభానికి ముందు మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల జాతీయ గీతాలాపన జరిగింది. అయితే జనగణమన సమయంలో విరాట్ కోహ్లీ గీతాలాపన చేయకుండా చూయింగ్ గమ్ నములుతూ కనిపించాడు. దాంతో.. కోహ్లీ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడేళ్లు భారత జట్టుకి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లీ.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యహరించడంపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ఇలా చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా.. బీసీసీఐ లేదా టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా వివరణ ఇవ్వలేదు.
వాస్తవానికి విరాట్ కోహ్లీ కెరీర్పరంగా గత ఐదు నెలల నుంచి కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఐదు నెలల్లో వరుసగా అతను టీ20, వన్డే, టెస్టు కెప్టెన్సీకి దూరమయ్యాడు. అలానే టీమిండియా మేనేజ్మెంట్ నుంచి కూడా కోహ్లీకి మునుపటిలా సపోర్ట్ లభించడం లేదు. దాంతో.. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా కోహ్లీలో పూర్తి ఏకాగ్రతతో కనిపించడం లేదు.
వాస్తవానికి విరాట్ కోహ్లీ కెరీర్పరంగా గత ఐదు నెలల నుంచి కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఐదు నెలల్లో వరుసగా అతను టీ20, వన్డే, టెస్టు కెప్టెన్సీకి దూరమయ్యాడు. అలానే టీమిండియా మేనేజ్మెంట్ నుంచి కూడా కోహ్లీకి మునుపటిలా సపోర్ట్ లభించడం లేదు. దాంతో.. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా కోహ్లీలో పూర్తి ఏకాగ్రతతో కనిపించడం లేదు.