యాప్నగరం

U-19 వరల్డ్‌కప్‌లో గొడవపై కపిల్‌దేవ్ ఫైర్

భారత్‌కి 1983లో వరల్డ్‌కప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్.. మైదానంలో ఒక్కసారి కూడా క్రమశిక్షణ తప్పలేదు. కానీ.. ఇటీవల భారత అండర్-19 క్రికెటర్లు బాహాబాహీకి దిగారు.

Samayam Telugu 14 Feb 2020, 3:32 pm
క్రికెట్‌ ఇకపై జెంటిల్మెన్ గేమ్ కాబోదని భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా గడ్డపై గత ఆదివారం జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలుపొందిన బంగ్లాదేశ్ టీమ్.. గెలుపు సంబరాల్లో హద్దులు మీరి భారత్ క్రికెటర్లని కవ్వించగా.. ఇరు జట్ల ఆటగాళ్లు గొడవపడ్డారు. దీంతో.. ఐసీసీ కూడా సీరియస్ అయ్యి.. ఇద్దరు భారత్, ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది.
Samayam Telugu India U-19


Read More: undefined

ఫైనల్లో గొడవపై కపిల్‌దేవ్ మాట్లాడుతూ ‘క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని ఎవరు చెప్పారు..? అండర్-19 వరల్డ్‌కప్‌‌ ఫైనల్లో జరిగిన ఘటన తర్వాత క్రికెట్‌ జెంటిల్మెన్ గేమ్ అని అనగలమా..? అయినా.. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత.. మైదానంలోకి వెళ్లి గొడవే పడే హక్కు క్రికెటర్లకి ఎక్కడిది..? ఆ క్రికెటర్లందరూ 18 ఏళ్ల వారే.. తొందరపడిండొచ్చు. కానీ.. టీమ్ మేనేజర్ అప్పుడు ఏం చేస్తున్నట్లు..? మ్యాచ్ తర్వాత అతను బాధ్యత తీసుకుని ఉండాల్సింది’ అని వెల్లడించాడు.

Read More : ట్రోఫీని విరగొట్టిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్

అండర్-19 స్థాయిలోనే క్రికెటర్లు ఇలా క్రమశిక్షణ తప్పి మైదానంలో గొడవలకి దిగితే..? భవిష్యత్‌లో వారు ఏ మేరకు క్రమశిక్షణతో గ్రౌండ్‌లో ఉంటారని మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐసీసీ చర్యలు తీసుకోగా.. బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఫైనల్లో గొడవపడిన ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.