యాప్నగరం

ధోనీ కథ ఇంకా ముగిసిపోలేదు.. అదొక మిస్టరీ: మాజీ కీపర్

మైదానంలో మహేంద్రసింగ్ సింగ్ ఆలోచనలే కాదు.. వ్యూహాలు కూడా ఎవరి అంచనాలకి అందవు. కెరీర్ పరంగా అతని నిర్ణయాలు కూడా అలానే ఉంటాయని 2014లో ఆకస్మికంగా టెస్టు రిటైర్మెంట్ ప్రకటించడంతో స్పష్టం చేశాడు. ఇకపై కూడా..

Samayam Telugu 31 Jul 2020, 11:21 am
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఇంకా ముగిసిపోలేదని భారత మాజీ వికెట్ కీపర్ విజయ్ దాహియా అభిప్రాయపడ్డాడు. గత ఏడాది జులైలో 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లాడిన ధోనీ.. ఆ తర్వాత క్రికెట్‌కి పూర్తిగా దూరమైపోయాడు. దాంతో.. సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి ధోనీ పేరుని బీసీసీఐ తొలగించగా.. అతని ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ.. రిటైర్మెంట్‌పై మౌనంగా ఉండిపోయిన ఈ భారత మాజీ కెప్టెన్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరగనుంది.
Samayam Telugu MS Dhoni


ధోనీ కెరీర్‌పై స్పోర్ట్స్‌క్రీడా‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దాహియా మాట్లాడుతూ ‘‘ధోనీతో కలిసి ఓ 30 ఏళ్లు జీవించిన వాళ్లు కూడా.. అతని ఆలోచనలు ఏంటి..? ఏం చేయబోతున్నాడు..? అనే విషయాల్ని తెలుసుకోలేరు. ధోనీ అంటే అదే మరి.. మిస్టరీ. భారత క్రికెట్‌కి గురించి మాట్లాడిన ప్రతిసారి.. ధోనీ గురించి తప్పకుండా ప్రస్తావన వస్తుంది. అతని గొప్పతనం అలాంటిది. నా అంచనా ప్రకారం అతని కెరీర్ ఇంకా ముగియలేదు’’ వెల్లడించాడు.

భారత్ తరఫున విజయ్ దాహియా రెండు టెస్టులు, 19 వన్డే మ్యాచ్‌లాడాడు. అయితే.. కేవలం ఏడాదిలోనే దాహియా కెరీర్ ముగిసింది. 2000లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్.. 2001లో జింబాబ్వేతో ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. అయితే.. ఆ తర్వాత కోచ్‌గా ఈ దాహియా స్థిరపడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.