యాప్నగరం

T20 World Cup 2022 జట్టు ఎంపికలో మాజీ కోచ్ సూచనల్ని పట్టించుకోని సెలెక్టర్లు

India's T20 WC squad లోకి సంజు శాంసన్‌ని ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది అతని రికార్డులు కూడా బాగున్నాయి. కానీ రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు జట్టులో ఉండటంతో...

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 13 Sep 2022, 7:20 am

ప్రధానాంశాలు:

  • టీ20 వరల్డ్‌కప్‌కి భారత జట్టు ప్రకటన
  • సంజు శాంసన్‌కి మొండిచేయి
  • వికెట్ కీపర్లుగా పంత్, కార్తీక్ ఎంపిక
  • సంజు గురించి రవిశాస్త్రి ఇంట్రస్టింగ్ కామెంట్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sanju Samson (Pic Source: Twitter)
సంజు శాంసన్ (Pic Source: Twitter)
టీ20 వరల్డ్‌ కప్ 2022 కోసం భారత జట్టు ఎంపికలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచనల్ని సెలెక్టర్లు పట్టించుకోలేదని తెలుస్తోంది. అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం సోమవారం సాయంత్రం 15 మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు ప్రకటించారు. ఈ టీమ్‌లో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లకి ఛాన్స్ ఇచ్చిన భారత సెలెక్టర్లు.. సంజు శాంసన్‌ని మాత్రం పక్కన పెట్టారు. దినేశ్ కార్తీక్‌ని ఫినిషర్‌గా ఎంపిక చేసి రెండో వికెట్ కీపర్‌ కోటాలో సంజు శాంసన్‌కి చోటిస్తారని మాజీలు అంచనా వేశారు. కానీ సంజూకి మొండిచేయి తప్పలేదు.
సంజు శాంసన్‌కి భారత సెలెక్టర్లు మొండిచేయి చూపడంతో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇటీవల అతని గురించి చెప్పిన ఓ మాట వెలుగులోకి వచ్చింది. ‘‘ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితులకి సంజు శాంసన్ బ్యాటింగ్‌ బాగా నప్పుతుంది. అక్కడ బౌన్స్, పేస్‌‌ పిచ్‌లపై సంజు శాంసన్‌ చక్కగా ఆడగలడు. దానికి కారణం ఏంటంటే? అతను బ్యాట్‌పైకి బంతి రావడాన్ని చాలా ఇష్టపడతాడు. నిజాయతీగా చెప్పాలంటే అలాంటి కండీషన్స్‌లో భారత క్రికెటర్లందరి కంటే సంజు శాంసన్ ఎక్కువ షాట్స్ ఆడగలడు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

వాస్తవానికి ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో భారత వికెట్ కీపర్లు రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్ కంటే సంజు శాంసన్ నిలకడగా రాణించాడు. స్ట్రైక్‌రేట్‌లోనూ సంజూనే మెరుగు. సంజు 44.7 సగటు, 158.4 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయగా.. రిషబ్ పంత్ 25.9 & 133.5, దినేశ్ కార్తీక్ 21.4 & 133.3తో ఉండటం గమనార్హం.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.