యాప్నగరం

భారత మాజీ క్రికెటర్ భార్యకి కరోనా పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో కొనసాగుతోంది. తాజాగా భారత మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా భార్యకి కరోనా పాజిటివ్‌గా తేలగా.. క్రికెటర్‌తో పాటు అతని కొడుకులు, తండ్రి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

Samayam Telugu 11 Jul 2020, 8:38 pm
భారత మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా భార్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. పశ్చిమ బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్‌గా ప్రస్తుతం లక్ష్మీ రతన్ శుక్లా ఉండగా.. అతని భార్య స్మిత సన్యాల్ శుక్లా... హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట‌లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తోంది. తాజాగా స్మిత కరోనా వైరస్ బారిన పడినట్లు స్వయంగా లక్ష్మీ రతన్ వెల్లడించాడు.
Samayam Telugu ​Laxmi Ratan Shukla
Laxmi Ratan Shukla.Photo)


భారత్ తరఫున మూడు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లాడిన లక్ష్మీ రతన్ శుక్లా.. 18 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టాడు. అలానే 2008 నుంచి 2014 వరకూ మొత్తం 47 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన ఈ ఆల్‌రౌండర్ 405 పరుగులు చేసి.. 15 వికెట్లు పడగొట్టాడు. తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి ఆడిన లక్ష్మీ రతన్ శుక్లా.. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కూడా ఆడాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పెద్దగా రాణించలేకపోయిన ఈ ఆల్‌రౌండర్.. బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో 137 ఫస్ట్ క్లాస్, 141 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడటం విశేషం. 2015లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన లక్ష్మీ రతన్ శుక్లా.. రాజకీయాల్లో చేరి ప్రస్తుతం స్పోర్ట్స్‌ మినిస్టర్‌గా ఉన్నాడు.

‘‘అవును.. నా భార్య స్మితకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెకి తేలికపాటి జ్వరం వచ్చింది. దాంతో.. వైద్యులు సూచించిన మేరకు మందులు తీసుకుంటోంది. నేను, నా ఇద్దరు కొడుకులు, మా నాన్న ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాం. మాకు రానున్న గురువారం కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు’’ అని లక్ష్మీ రతన్ శుక్లా వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.