యాప్నగరం

ఉత్తరాఖండ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్

ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో 19,410 పరుగులు చేసిన వసీమ్ జాఫర్.. దేశవాళీ దిగ్గజ క్రికెటర్‌గా అందరితో కితాబులు అందుకున్నాడు. ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన జాఫర్.. తాజాగా కోచ్‌ బాధ్యతలు చేపట్టాడు.

Samayam Telugu 23 Jun 2020, 7:48 pm
ఉత్తరాఖండ్‌ టీమ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్, దేశవాళీ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడు వసీమ్ జాఫర్ నియమితుడయ్యాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఖ్యాతి గడించిన వసీమ్ జాఫర్.. ఈ ఏడాది మార్చిలో రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో.. కోచ్ పదవి కోసం అతడ్ని ఉత్తరాఖండ్ టీమ్ మేనేజ్‌మెంట్ ఇటీవల సంప్రదించగా.. ఆ బాధ్యతలు చేపట్టేందుకు తాను అంగీకరించినట్లు తాజాగా 42ఏళ్ల వసీమ్ జాఫర్ వెల్లడించాడు.
Samayam Telugu wasim jaffer


2000 నుంచి 2008 వరకూ టీమిండియా తరఫున ఆడిన వసీమ్ జాఫర్.. 31 టెస్టుల్లో ఐదు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. కానీ.. వన్డేల్లో మాత్రం ఈ మాజీ ఓపెనర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం దాదాపు రెండు దశాబ్దాలపాటు వసీమ్ జాఫర్ తిరుగులేని ఆధిపత్యం కనబర్చాడు. 260 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 50.67 సగటుతో జాఫర్ ఏకంగా 19,410 పరుగులు చేయడం అతని నిలకడకి నిదర్శనం.

‘‘నేను తొలిసారి ఒక జట్టుకి హెడ్‌కోచ్‌గా వ్యవహరించబోతున్నాను. ఈ బాధ్యత నాకు ఓ సవాల్‌.. కొత్త కూడా. క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత.. కోచ్‌గా పనిచేయాలని గతంలోనే నేను నిర్ణయించుకున్నాను’’ అని వసీమ్ జాఫర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.