యాప్నగరం

రైనా ఏం మాట్లాడుతున్నావ్..? చురకలేసిన మాజీ చీఫ్ సెలక్టర్

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలనుకునే సురేశ్ రైనా చేయాల్సింది ఫామ్ నిరూపించుకోవడం. వీవీఎస్ లక్ష్మణ్‌పై అప్పట్లో వేటు పడితే అతను దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫామ్ నిరూపించుకుని మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు. మరి రైనా..? - ఎమ్మెస్కే ప్రసాద్

Samayam Telugu 5 May 2020, 6:59 pm
భారత సెలక్టర్ల తీరుపై ఇటీవల మండిపడిన వెటరన్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనాకి టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చురకలేశాడు. 2018, జులైలో చివరిగా భారత్ తరఫున మ్యాచ్‌లాడిన సురేశ్ రైనా.. గత ఏడాది నుంచి రీఎంట్రీ కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాడు. కానీ.. సెలక్టర్ల నుంచి అతనికి పిలుపు మాత్రం రావడం లేదు. దాంతో.. సీనియర్ క్రికెటర్ల విషయంలో కొంచెం బాధ్యతగా వ్యవహరించాలని సెలక్టర్లకి రైనా హితవు పలికాడు.
Samayam Telugu సురేశ్ రైనా


రైనా వ్యాఖ్యలపై ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ ‘‘1999లో భారత టెస్టు జట్టులో వీవీఎస్ లక్ష్మణ్ చోటు కోల్పోయాడు. దాంతో.. అతను దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఏకంగా 1400 పరుగులు చేసి మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇది వేటు పడిన సీనియర్ ఆటగాడి నుంచి సెలక్టర్లు ఆశించేది. దురదృష్టవశాత్తు సురేశ్ రైనా నుంచి దేశవాళీ క్రికెట్‌లో ఆ ప్రదర్శన కనిపించలేదు. చాలా మంది యువ క్రికెటర్లు దేశవాళీ, భారత్-ఎ జట్టు తరఫున మెరుపులు మెరిపించి టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు’’ అని వెల్లడించాడు.

ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని భారత సెలక్షన్ కమిటీ సాహసోపేత నిర్ణయాలకి పెట్టింది పేరు. ఎన్ని విమర్శలు వచ్చినా.. అంబటి రాయుడ్ని వరల్డ్‌కప్ జట్టు నుంచి పక్కన పెట్టడం, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా‌లకి చోటివ్వకపోవడం, ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఆఖరికి ధోనీనే టీమ్‌లోకి ఎంపిక చేయకపోవడం.. ప్రొఫెషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని పక్కనపెట్టి అతని స్థానంలో ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ని ఎంపిక చేయడం. ఇలా చాలా కఠినమమైన నిర్ణయాలను ఆ కమిటీ తీసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.