యాప్నగరం

అయోధ్య తీర్పుపై వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్..!

విషయం ఎలాంటిదైనా తనదైన శైలిలో ట్వీట్స్ చేసే వీరేంద్ర సెహ్వాగ్.. అయోధ్య భూమి తీర్పుపై ఈరోజు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై అభిమానుల నుంచి భిన్నమైన స్పందన లభిస్తోంది.

Samayam Telugu 9 Nov 2019, 2:18 pm
అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం గురించి శనివారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. 2.77 ఎకరాల ఆ భూమిని రామ మందిరం కోసం హిందువులకి అప్పగించాలని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే ముస్లింలకి కూడా 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. సుదీర్ఘకాలంగా నడిచిన వివాదంపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో దేశంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
Samayam Telugu New Delhi: Former Indian cricketer Virender Sehwag speaks during the launch of ...
Virender Sehwag


Read More: సిక్సర్ల వరల్డ్ రికార్డ్ ముంగిట రోహిత్ శర్మ

వీరేంద్ర సెహ్వాగ్ సాధారణంగా చమత్కారరీతిలో ట్వీట్స్ చేస్తుంటాడు. కానీ.. అయోధ్య భూమి వివాదం చాలా సున్నితమైనది కావడంతో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ‘శ్రీరామ్.. జై రామ్.. జై జై రామ్’ అని శ్రీరాముడి ఫొటోని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్‌పై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సెహ్వాగ్‌ని పొగుడుతుంటే.. మరికొందరు చిక్కుల్లో పడతావంటూ హెచ్చరిస్తున్నారు.

Read More: అప్పట్లో సచిన్.. ఇప్పుడు రోహిత్ అంతే: సెహ్వాగ్
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ కామెంటేటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ కొనసాగుతున్నాడు. విషయం ఏదైనా.. కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పడంలో ఈ డాషింగ్ ఓపెనర్‌ది ప్రత్యేక శైలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.