యాప్నగరం

ధోనీ స్థానాన్ని పంత్ భర్తీ చేయగలడు..!

భారత్ టెస్టు జట్టు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే..? కచ్చితంగా హిట్టింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వికెట్ కీపర్ కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 9 Nov 2018, 9:09 pm
భారత జట్టులో మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భర్తీ చేయగలడని మాజీ వికెట్ కీపర్ దహియా ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. ఆఖరి టెస్టులో శతకం బాది.. ఆ తర్వాత వెస్టిండీస్‌తో వరుసగా రెండు టెస్టుల్లోనూ 92, 92 పరుగులతో రాణించాడు. దీంతో.. ఏకంగా ధోనీపై వేటు వేసి మరీ టీ20ల్లో రిషబ్ పంత్‌కి సెలక్టర్లు ఛాన్సిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగగా.. ధోనీ స్థానాన్ని జట్టులో భర్తీ చేయగల సామర్థ్యం పంత్‌కి ఉందని దహియా చెప్పుకొచ్చాడు.
Samayam Telugu File_Photo_Rishabh_Pant_and_MS_Dhoni_1538792335


‘భారత్ టెస్టు జట్టు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే..? కచ్చితంగా హిట్టింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వికెట్ కీపర్ కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ధోనీ తర్వాత సాహాతో పాటు పార్థీవ్ పటేల్, దినేశ్ కార్తీక్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ ఛాన్సిలిచ్చి పరీక్షించింది. కానీ.. వారు విఫలమయ్యారు. కానీ.. రిషబ్ పంత్.. ఆ అవకాశాల్ని చక్కగా వినియోగించుకుని.. టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతని ఆట చూస్తుంటే ధోనీ స్థానాన్ని జట్టులో అతను భర్తీ చేయగలడనిపిస్తోంది’ అని దహియా వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.