యాప్నగరం

ధోనీని ఆ సమస్య బాధపెట్టింది: మాజీ కీపర్

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం కొత్తలోనే బ్యాట్స్‌మెన్‌గా ధోనీ నిరూపించుకున్నాడు. కానీ.. వికెట్ కీపర్‌గా మాత్రం టెస్టుల్లో తేలిపోయినట్లు కిరణ్ మోర్ వెల్లడించాడు.

Samayam Telugu 11 Apr 2020, 7:41 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కెరీర్ ఆరంభంలో ఓ సమస్య బాధపెట్టిందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోర్ వెల్లడించాడు. 2004లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ధోనీ.. తొలుత పవర్ హిట్టర్‌గా వెలుగులోకి వచ్చాడు. ముఖ్యంగా.. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో మిడిలార్డర్‌లో ఆడిన ధోనీ తన ఫినిషింగ్ స్కిల్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Samayam Telugu MS Dhoni Retairment


Read More: లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్.. భారత క్రికెటర్‌కి రూ. 500 జరిమానా

కెరీర్ ఆరంభంలోనే బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న ధోనీ.. పేలవ వికెట్ కీపింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నట్లు కిరణ్ మోర్ వెల్లడించాడు. వన్డేల్లో అతని కీపింగ్ ఫర్వాలేదనిపించినా.. టెస్టుల్లో మాత్రం మరీ తీసికట్టుగా ఉండేదంటూ మోర్ చెప్పుకొచ్చాడు. అయితే.. తన కీపింగ్ బలహీనతల్ని గుర్తించిన ధోనీ.. వాటిని అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించినట్లు కూడా కిరణ్ మోర్ వెల్లడించాడు.

Read More: డీఎస్పీగా మారిన క్రికెటర్ భయపడిన వేళ..!

‘‘ధోనీ ఎంత ప్రతిభావంతుడో..? మనం అందరం చూశాం. కానీ.. వికెట్ కీపింగ్‌లో మాత్రం అతని సామర్థ్యంపై మొదట్లో కొందరు సందేహం వ్యక్తం చేశారు. వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏడాది తర్వాత టెస్టుల్లో ధోనీ ఆడాడు. కానీ.. వన్డేలతో పోలిస్తే..? టెస్టుల్లో కీపింగ్ చాలా భిన్నం. దాంతో.. ధోనీకి కొత్త సమస్య మొదలైంది.. అతడ్ని బాధపెట్టింది కూడా. అయితే.. టెస్టుల్లో రాణించాలంటే శ్రమించాల్సిందేనని ధోనీ వేగంగా గ్రహించగలిగాడు. ఆ మేరకు కష్టపడ్డాడు. మరోవైపు టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా అతనికి వరసగా అవకాశాలిచ్చింది. ఎందుకంటే.. కేవలం 3- 4 మ్యాచ్‌ల్లోనే ఆటగాడి సామర్థ్యంపై ఓ అంచనాకి రాకూడదని అప్పట్లో మేనేజ్‌మెంట్ భావించింది.’’ అని కిరణ్ మోర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.