అండర్-19 జట్టులోని తనను తీసుకోలేదని ఓ అంతర్జాతీయస్థాయి మాజీ క్రికెటర్ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పాకిస్థాన్ మీడియా సంస్థ జియో న్యూస్ కథనం ప్రకారం.. పాక్ మాజీ క్రికెటర్ ఆమెర్ హనీఫ్ కుమారుడు మహమ్మద్ జర్యాబ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనను అండర్-19 జట్టుకు ఎంపిక చేయలేదనే బాధతోనే జర్యాబ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వయసు ఎక్కువగా ఉందని, అండర్-19కు అర్హుడువు కావని సెలెక్టర్లు చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురైన జర్యాబ్ కఠిన నిర్ణయానికి పాల్పడినట్లు అతని తండ్రి హనీఫ్ చెప్పారు.
‘నా కొడుకు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఎంపికకు ఉండాల్సిన దానికన్నా తన వయసు ఎక్కువ ఉందని నాకు చెప్పాడు. కోచ్ల ప్రవర్తనే నా కొడుకుని ఆత్మహత్య చేసుకునేలా చేసింది’ అని హనీఫ్ ఆరోపించారు. ఇలాంటి సహకారంలేని వాతావరణం నుంచి ఇతర కుమారులను కాపాడాలి అని హనీఫ్ వేడుకున్నారు.
డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న జర్యాబ్ ఈ ఏడాది జనవరిలో లాహోర్లో జరిగిన అండర్-19 టోర్నమెంట్లో కరాచీకి ప్రాతినిధ్యం వహించాడు. టోర్నీలో అతను గాయపడటంతో ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. అయితే దానికి జర్యాబ్ ఒప్పుకోలేదు. మళ్లీ జట్టులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి ఇంటికి చేరాడు. తరవాత గాయం నుంచి కోలుకుని జర్యాబ్ మళ్లీ వెళ్లాడు. అయితే వయసు ఎక్కువగా ఉందనే కారణంతో జర్యాబ్ను జట్టులోకి తీసుకోలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన జర్యాబ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, హనీఫ్ 1990ల్లో వన్డేల్లో పాకిస్థాన్కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం ఐదు వన్డేలు ఆడారు.
‘నా కొడుకు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఎంపికకు ఉండాల్సిన దానికన్నా తన వయసు ఎక్కువ ఉందని నాకు చెప్పాడు. కోచ్ల ప్రవర్తనే నా కొడుకుని ఆత్మహత్య చేసుకునేలా చేసింది’ అని హనీఫ్ ఆరోపించారు. ఇలాంటి సహకారంలేని వాతావరణం నుంచి ఇతర కుమారులను కాపాడాలి అని హనీఫ్ వేడుకున్నారు.
డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న జర్యాబ్ ఈ ఏడాది జనవరిలో లాహోర్లో జరిగిన అండర్-19 టోర్నమెంట్లో కరాచీకి ప్రాతినిధ్యం వహించాడు. టోర్నీలో అతను గాయపడటంతో ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. అయితే దానికి జర్యాబ్ ఒప్పుకోలేదు. మళ్లీ జట్టులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి ఇంటికి చేరాడు. తరవాత గాయం నుంచి కోలుకుని జర్యాబ్ మళ్లీ వెళ్లాడు. అయితే వయసు ఎక్కువగా ఉందనే కారణంతో జర్యాబ్ను జట్టులోకి తీసుకోలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన జర్యాబ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, హనీఫ్ 1990ల్లో వన్డేల్లో పాకిస్థాన్కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం ఐదు వన్డేలు ఆడారు.