యాప్నగరం

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఫిక్సింగ్.. సంచలన విషయాలు వెలుగులోకి

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఫిక్సింగ్ జరిగినట్లు గతంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ ఆరోపణలు చేశాడు. కానీ.. అప్పట్లో అతని వ్యాఖ్యల్ని ఎవరూ సీరియస్‌‌గా తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు ఏకంగా శ్రీలంక అప్పటి క్రీడల మంత్రి ఆరోపణలు గుప్పించాడు.

Samayam Telugu 18 Jun 2020, 4:56 pm
భారత్, శ్రీలంక మధ్య ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి గురైనట్లు.. శ్రీలంక అప్పటి క్రీడల మంత్రి మహీందానంద అలుత్‌గమాగే సంచలన ఆరోపణలు చేశాడు. ఆ మ్యాచ్‌లో టాస్ వద్దే కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, కుమార సంగక్కర మధ్య కన్‌ప్యూజన్ కారణంగా రెండు సార్లు టాస్ వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రీలంక తుది జట్టు ఎంపికపైనా ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ అప్పట్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు గుప్పించాడు. తాజాగా ఆ దేశ క్రీడల మంత్రి స్వయంగా ఆరోపణలు చేయడంతో ఫైనల్‌ మ్యాచ్‌పై అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి.
Samayam Telugu 2011 World Cup Final
Getty Images


Read More: undefined

ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) శతకం బాదడంతో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని భారత్ జట్టు.. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4), మహేంద్రసింగ్ ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడటంతో 48.2 ఓవర్లలోనే 277/4తో ఛేదించింది. 1983లో తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టు.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ 2011లో వరల్డ్‌కప్ గెలిచిన విషయం తెలిసిందే.

ఆ ఫైనల్ మ్యాచ్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూ మహీందానంద అలుత్‌గమాగే మాట్లాడుతూ ‘‘ నేను ఈరోజు చెప్తున్నా.. 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో శ్రీలంక అమ్ముడుపోయింది. నేను అప్పట్లో స్పోర్ట్స్ మినిస్టర్‌.. అయినప్పటికీ నమ్మక తప్పడం లేదు. 2011లో వన్డే ప్రపంచకప్‌ని శ్రీలంక గెలిచి ఉండేది. కానీ.. ఆ మ్యాచ్‌ని మేము అమ్మేశాం. నేను ఏ ఆటగాడితోనూ ప్రస్తుతం కాంటాక్ట్‌లో లేను. కానీ.. టీమ్‌లోని కొంతమంది ఫిక్సింగ్‌కి సహకరించారు’’ అని సంచలన ఆరోపణలు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.