యాప్నగరం

మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ కన్నుమూత, ప్రధాని సంతాపం

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ (77) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని జన్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Samayam Telugu 16 Aug 2018, 12:58 am
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ (77) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని జన్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాడేకర్ ఇండియా తరఫున 37 టెస్ట్ మ్యాచ్‌లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడారు. భారత జట్టుకు మేనేజర్‌గా, కోచ్‌గానూ సేవలందించారు.
Samayam Telugu Untitledzcv


ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌గా భారత జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపుపొందారు. ఎనిమిదేళ్ల టెస్ట్‌ కెరీర్‌లో ఆయన 14 అర్ధ శతకాలు, ఒక శతకంతో మొత్తం 2113 పరుగులు చేశారు. 1967లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీతో గౌరవించింది. వాడేకర్‌ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తోపాటు ప్రధాని నరేంద్ర మోడీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు విచారం వ్యక్తంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.