యాప్నగరం

భారత్‌పై చివరి వన్డేలో సత్తాచూపిస్తాం..!

భారత్‌తో ఆదివారం జరగనున్న చివరి వన్డేలో సత్తాచూపిస్తామని శ్రీలంక మాజీ కెప్టెన్ మాథ్యూస్ ధీమా వ్యక్తం చేశాడు.

TNN 2 Sep 2017, 5:23 pm
భారత్‌తో ఆదివారం జరగనున్న చివరి వన్డేలో సత్తాచూపిస్తామని శ్రీలంక మాజీ కెప్టెన్ మాథ్యూస్ ధీమా వ్యక్తం చేశాడు. గత గురువారం కొలంబోలో ముగిసిన నాలుగో వన్డేలో అర్ధశతకంతో లంక పరువు కోసం ఒంటరిపోరాటం చేసిన మాథ్యూస్ (70) చివరికి పేలవ షాట్‌‌తో వికెట్ చేజార్చుకున్నాడు. ఇప్పటికే భారత్ చేతిలో టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌కి గురైన శ్రీలంక.. ఐదు వన్డేల సిరీస్‌లోనూ 0-4తో వెనకబడి వైట్‌వాష్ ప్రమాదం ముంగిట ఉంది. ఆదివారం మధ్యాహ్నం కొలంబో వేదికగానే ఐదో వన్డే జరగనుంది.
Samayam Telugu frustrated with my batting performance against india
భారత్‌పై చివరి వన్డేలో సత్తాచూపిస్తాం..!


‘వ్యక్తిగతంగా వన్డేల్లో నా ప్రదర్శనపై తీవ్ర నిరాశలో ఉన్నాను. క్రీజులో వేగంగా కుదురుకుని పరుగులు రాబడుతున్నా.. ఔటవుతున్న తీరు బాధిస్తోంది. ఇక సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే నా బ్యాటింగ్‌ తీరుతో నేను విసుగుచెందాను. జట్టుకి విజయాలు అందించలేకపోయినా.. కనీస ముద్ర వేయగలిగాననే సంతృప్తి మాత్రమే నాకు మిగిలింది. చివరి వన్డేలో శ్రీలంక తప్పకుండా గెలిచి సత్తా చూపిస్తుంది’ అని మాథ్యూస్ ధీమా వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.