యాప్నగరం

ఐపీఎల్: గంభీర్‌ కోసం ఏడేళ్లు నిరీక్షించాం

భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ కోసం తాము ఏడేళ్లు నిరీక్షించినట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈవో హేమంత్ దువా

TNN 29 Jan 2018, 8:41 pm
భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ కోసం తాము ఏడేళ్లు నిరీక్షించినట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈవో హేమంత్ దువా వెల్లడించాడు. బెంగళూరు వేదికగా శని, ఆదివారం జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో గౌతమ్ గంభీర్‌ని రూ. 2.8 కోట్లకి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గత ఏడేళ్లు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడిన గంభీర్.. కెప్టెన్‌గా ఆ జట్టును రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. తొలి ఐపీఎల్‌ సీజన్‌ 2008 నుంచి 2010 వరకు ఈ ఓపెనర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడినా ఆ జట్టుకి టైటిల్‌ను అందించలేకపోయాడు.
Samayam Telugu gambhir has unfinished business with delhi daredevils says ceo dua
ఐపీఎల్: గంభీర్‌ కోసం ఏడేళ్లు నిరీక్షించాం


‘ఏడేళ్లుగా గౌతమ్ గంభీర్‌‌‌ని దక్కించుకునే అవకాశం కోసం నిరీక్షించాం. ఎందుకంటే.. అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి టైటిల్‌ని అందించే బాధ్యతను మధ్యలో విడిచిపెట్టి వెళ్లాడు. గత ఏడాది టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్‌ నిలిస్తే.. తర్వాత స్థానంలో గౌతమ్ గంభీర్ నిలిచాడు. అతనో నాయకుడు. ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానె, గౌతమ్ గంభీర్‌లలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని వేలం కంటే ముందే నిర్ణయించుకున్నాం. అయితే.. అశ్విన్‌‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ ఆదిలోనే కొనుగోలు చేయడంతో.. గంభీర్‌ని కొనుగోలు చేయాలని ఫిక్సయ్యాం. అయితే.. వేలంలో గంభీర్‌ కోసం పంజాబ్ పోటీపడుతుందని కంగారుపడ్డాం. కానీ.. ఆ ఫ్రాంఛైజీ వెనక్కి తగ్గడంతో మా పని సులువైంది’ అని హేమంత్ దువా వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.