యాప్నగరం

టైమివ్వండంటూ బీసీసీఐకి గంగూలీ లేఖ

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌(క్యాబ్)‌లో లోధా సంస్కరణల అమలుకి కొంత గడువివ్వాలని కోరుతూ బీసీసీఐకి భారత మాజీ

TNN 23 Feb 2018, 6:38 pm
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌(క్యాబ్)‌లో లోధా సంస్కరణల అమలుకి కొంత గడువివ్వాలని కోరుతూ బీసీసీఐకి భారత మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేఖ రాశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో పారదర్శకత పెంచేందుకు ఏడాది క్రితం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించిన లోధా కమిటీ కొన్ని సిఫార్సుల్ని బోర్డుకి సూచించిన విషయం తెలిసిందే. అయితే.. వాటిని అమలు చేసేందుకు బీసీసీఐ మాత్రం ఆసక్తి కనబర్చ లేదు. దీంతో గత ఏడాది ఆరంభంలోనే బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలపై సుప్రీంకోర్టు వేటు వేసింది. దీంతో బోర్డులో కొంచెం కదలిక వచ్చినా.. పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు.
Samayam Telugu ganguly to bcci lodha recommendations not implemented due to time constraint
టైమివ్వండంటూ బీసీసీఐకి గంగూలీ లేఖ


దేశంలోని రాష్ట్ర క్రికెట్ సంఘాల అభిప్రాయాలు తీసుకుని తర్వాత అమలు చేస్తామని.. కొన్నిరోజులు తాత్సారం చేసిన బీసీసీఐ.. తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందేమోనని భయపడుతోంది. దీంతో.. అన్ని సంఘాలకి ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపిన బీసీసీఐ.. సంస్కరణల్ని అమలు చేయాలని సూచించింది. అయితే.. క్యాబ్‌ సర్వసభ్య సమావేశం ఇటీవల ముగిసిందని.. దీంతో మరోసారి ఈ సమావేశం నిర్వహించి.. నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని లేఖలో గంగూలీ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.