యాప్నగరం

పేదల ఆకలి తీరుస్తున్న గంభీర్ ఫౌండేషన్

గత ఏడాది పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకి బాసటగా నిలిచిన గంభీర్ ఫౌండేషన్‌.. తాజాగా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదల ఆకలి బాధని తీరుస్తోంది.

Samayam Telugu 28 Mar 2020, 11:40 am
కరోనా వైరస్ కట్టడికి దేశంలో మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ని విధించడంతో ఉపాధి కోల్పోయిన పేదలకి గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌ అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి గౌతమ్ గంభీర్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా.. అతను నెలకొల్పిన ‘‘గంభీర్ ఫౌండేషన్’’ ఢిల్లీలోని పేదల ఆకలి బాధని తీరుస్తోంది. పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని.. వారి ద్వారానే ఫౌండేషన్ ఆహారాన్ని అందజేస్తున్న వీడియోని తాజాగా గంభీర్ అభిమానులతో పంచుకున్నాడు. ‘‘మానవత్వం మా గుర్తింపు.. ఆకలిగా ఉన్నవారికి ఆహారాన్ని అందించడం మా బాధ్యత’’ అని అందులో ఈ మాజీ ఓపెనర్ రాసుకొచ్చాడు.
Samayam Telugu **EDS: TO GO WITH STORY NO DCM17** New Delhi: Former cricketer Gautam Gambhir ad...


Read More: భారత క్రికెటర్లకి ఈ బ్రేక్ మంచిదే: రవిశాస్త్రి

భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం మధ్యాహ్నానానికి 873కి చేరుకోగా.. ఇందులో 19 మంది ఇప్పటికే మరణించారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కరోనా వైరస్ కట్టడి విషయంలో సెలెబ్రిటీలు తమ వంతు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. సచిన్ టెండూల్కర్ ఇప్పటికే రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించగా.. సౌరవ్ గంగూలీ రూ. 50 లక్షలు విలువైన బియ్యాన్ని పేదలకి పంచి పెట్టనున్నట్లు వెల్లడించాడు.

Read More: లాక్‌డౌన్‌ను సీరియ‌స్‌గా తీసుకోండి.. కోహ్లీ చుర‌కలు

ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ ఇద్దరూ కలిసి ఇటీవల వందలాది మందికి మాస్కులను ఉచితంగా పంపిణీ చేయగా.. భారత క్రికెటర్లందరూ తమ వంతుగా కరోనా వైరస్‌పై ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. ఇక పాక్ క్రికెటర్లు అందరూ కలిసి రూ. 50 లక్షలు పాక్ ప్రభుత్వానికి విరాళంగా అందజేయగా.. బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ సగం జీతాల్ని ఆ దేశ ప్రభుత్వానికి అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.