యాప్నగరం

అఫ్రిదికి కరోనా పాజిటివ్.. హుందాగా స్పందించిన గంభీర్

గౌతమ్ గంభీర్, షాహిద్ అఫ్రిది మధ్య క్రికెట్ ఆడే రోజుల నుంచే మనస్పర్థలు ఉన్నాయి. ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించినా.. ఇప్పటికీ ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కానీ..?

Samayam Telugu 13 Jun 2020, 8:03 pm
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కరోనా వైరస్ పాజిటివ్‌గా రావడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. ఇంగ్లాండ్‌ పర్యటన కోసం శుక్రవారం 29 మందితో కూడిన జట్టుని ఎంపిక చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త్వరలోనే లాహోర్ వేదికగా క్యాంప్‌ని నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. కానీ.. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్‌కి కరోనా వైరస్ సోకడంతో పీసీబీ కూడా పునరాలోచనలో పడింది.
Samayam Telugu Shahid Afridi


పాక్‌లో లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పేదలకి ఇటీవల నిత్యావసరాలని, ఆహార పదార్థాలని అందించిన షాహిద్ అఫ్రిది.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ పర్యటించాడు. అయితే.. గత గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాని చెప్పుకొచ్చిన అఫ్రిది.. కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు శనివారం ప్రకటించాడు. దాంతో.. పాక్‌ క్రికెటర్లతో పాటు.. అతని ఒకప్పటి సహచరులు కూడా అఫ్రిది ఆరోగ్యంపై ఆరా తీస్తూ.. త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

అఫ్రిది మాట అంటేనే అంతెత్తున లేచే భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా.. అఫ్రిది త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు. ‘‘కరోనా వైరస్ బారిన ఎవరూ పడకూడదని నేను కోరుకుంటున్నా. షాహిద్ అఫ్రిదితో నాకు రాజకీయ విభేదాలు ఉన్నాయి. కానీ.. అతను వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. అఫ్రిది కంటే భారత్‌లో కరోనా వైరస్ బారినపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.