భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రతిష్టాత్మక బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)లో త్వరలో చోటు దక్కించుకోనున్నాడు. నాలుగేళ్లపాటు ఈ గంభీర్ పదవీకాలంలో కొనసాగనున్నాడు. అతనితోపాటు 1983 వరల్డ్కప్ నెగ్గిన జట్టులో సభ్యుడైన మదన్ లాల్ కూడా ఈ కమిటీలో పనిచేయనున్నాడు. ముగ్గురితో కూడిన ఈ కమిటీకి మదన్ నాయకత్వం వహించే అవకాశముంది.
Read Also : Ishant sharmaకు విరాట్ కోహ్లీ అద్దిరిపోయే రిప్లై
సీఏసీ సభ్యులుగా గంభీర్, మదన్తోపాటు మాజీ క్రికెటర్ సులక్షణ సింగ్ ఎంపికయ్యే అవకాశమున్నట్లు బోర్డు అధికారి తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే కొత్త సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలెక్టర్ గగన్ ఖోడా పదవీకాలం ఇప్పటికే ముగిసింది. వీరితోపాటు శరణ్దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపేలకు ఒక ఏడాది పదవీకాలం ఉంది.
Read Also : రోహిత్ శర్మ గురించి అతని రికార్డులే మాట్లాడుతాయ్
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్, సీనియర్ సెలెక్షన్ కమిటీ మొత్తాన్ని భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్లు భారత్ సాధించడంలో గంభీర్ కీలకపాత్ర పోషించాడు. రెండు టోర్నీల ఫైనల్లోనూ అత్యధిక స్కోరు సాధించాడు. గతేడాది క్రికెట్ నుంచి గంభీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇక ముంబైకి చెందని సులక్షణ తన కెరీర్లో రెండు టెస్టులు, 46 వన్డేలు ఆడింది.
Read Also : World Cup రనౌట్పై స్పందించిన ఎంఎస్ ధోనీ
Read Also : Ishant sharmaకు విరాట్ కోహ్లీ అద్దిరిపోయే రిప్లై
సీఏసీ సభ్యులుగా గంభీర్, మదన్తోపాటు మాజీ క్రికెటర్ సులక్షణ సింగ్ ఎంపికయ్యే అవకాశమున్నట్లు బోర్డు అధికారి తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే కొత్త సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలెక్టర్ గగన్ ఖోడా పదవీకాలం ఇప్పటికే ముగిసింది. వీరితోపాటు శరణ్దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపేలకు ఒక ఏడాది పదవీకాలం ఉంది.
Read Also : రోహిత్ శర్మ గురించి అతని రికార్డులే మాట్లాడుతాయ్
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్, సీనియర్ సెలెక్షన్ కమిటీ మొత్తాన్ని భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్లు భారత్ సాధించడంలో గంభీర్ కీలకపాత్ర పోషించాడు. రెండు టోర్నీల ఫైనల్లోనూ అత్యధిక స్కోరు సాధించాడు. గతేడాది క్రికెట్ నుంచి గంభీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇక ముంబైకి చెందని సులక్షణ తన కెరీర్లో రెండు టెస్టులు, 46 వన్డేలు ఆడింది.
Read Also : World Cup రనౌట్పై స్పందించిన ఎంఎస్ ధోనీ