యాప్నగరం

భారత్ వదిలేసిన రోజు టెస్టు క్రికెట్ చచ్చిపోతుంది: చాఫెల్

ప్రపంచ వ్యాప్తంగా టెస్టులకి ఆదరణ క్రమంగా తగ్గిపోతోంది. దాంతో.. క్రికెట్ బోర్డులు కూడా టెస్టు సిరీస్‌లను నిర్వహించడంపై పెద్దగా ఆసక్తి కనర్చడం లేదు. తాజాగా కరోనా దెబ్బకి కొన్ని దేశాల్లో టెస్టులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది.

Samayam Telugu 13 May 2020, 9:25 am
కరోనా వైరస్ కారణంగా క్రికెట్‌ బోర్డులన్నీ ఆర్థికంగా చాలా నష్టపోయాయి. దాంతో.. మళ్లీ క్రికెట్ మొదలవగానే ఎక్కువగా టీ20 మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐతో సాహా అన్ని క్రికెట్ దేశాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే ఎదురైన నష్టాల నుంచి బయటపడాలంటే ఇప్పట్లో టెస్టు క్రికెట్ జోలికి వెళ్లే సాహసం ఓ మూడు క్రికెట్ బోర్డుల తప్ప.. ఏవీ వెళ్లే సూచనలు కనిపించడం లేదు. వన్డే, టీ20లతో పోలిస్తే టెస్టులకి ఆదరణ, ఆదాయం తక్కువగా ఉండమే దానికి కారణం.
Samayam Telugu Team India Test Squad


Read More: రోహిత్ శర్మకి రైనా ఫిర్యాదు.. నా చేతుల్లో ఏమీ లేదన్న హిట్‌మ్యాన్

టెస్టు క్రికెట్‌‌కి భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జీవం పోస్తున్నాయని చెప్పుకొచ్చిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రేగ్ చాఫెల్.. ఒకవేళ భారత్ టెస్టు క్రికెట్‌ని వదిలేస్తే..? ఆ ఫార్మాట్ చచ్చిపోతుందని అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మినహా మరే దేశం కూడా టెస్టు క్రికెట్‌పై ఎక్కువ శ్రద్ధ కనబర్చడం లేదు. మరీ ముఖ్యంగా.. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ అత్యుత్తమమని చెప్పుకొస్తున్నాడు. కాబట్టి.. ఆ ఫార్మాట్‌ సజీవంగా ఉంటుందనే ఆశలు ఆ మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఒకవేళ భారత్ టెస్టు క్రికెట్‌ని వదిలేస్తే..? ఆ ఫార్మాట్ చచ్చిపోతుంది’’ అని ఛాపెల్ వెల్లడించాడు.

Read More: undefined

టీమిండియాకి కోచ్‌గా కొన్నాళ్లపాటు గ్రేగ్ చాఫెల్ వ్యవహరించగా.. అతని పర్యవేక్షణలో భారత్ జట్టు టెస్టుల్లో రెండు అరుదైన ఘనతల్ని అందుకుంది. 2006లో వెస్టిండీస్ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచిన టీమిండియా.. 35 ఏళ్ల గెలుపు నిరీక్షణకి తెరదించింది. అలానే తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపైనా టెస్టు మ్యాచ్‌ని గెలుపొందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.