యాప్నగరం

IND vs NZ 1st ODI: శతకం బాదిన శ్రేయాస్ అయ్యర్.. తొలి వన్డేలో కివీస్ టార్గెట్ 348

తొలి వన్డేలో ఓపెనర్లు విఫలమైనా.. శ్రేయాస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో కలిసి శతక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో భారత్ మెరుగైన స్కోరు చేయగలిగింది.

Samayam Telugu 5 Feb 2020, 11:34 am
న్యూజిలాండ్‌ని ఇటీవల ఐదు టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. వన్డే సిరీస్‌లోనూ అదే జోరుని కొనసాగిస్తోంది. హామిల్టన్ వేదికగా బుధవారం జరుగుతున్న తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ (103: 107 బంతుల్లో 11x4, 1x6) శతకం బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రేయాస్‌తో పాటు కేఎల్ రాహుల్ (88 నాటౌట్: 64 బంతుల్లో 3x4, 6x6) శతక సమాన ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51: 63 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
Samayam Telugu Mt Maunganui: Indias Shreyas Iyer bats during the Twenty/20 cricket internation...


Read More: undefined


మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గ్రౌండ్ చిన్నదిగా ఉండటం, ఛేదన సమయంలో మంచు కురిసే అవకాశం ఉండటంతో.. అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు‌కి ఓపెనర్లు పృథ్వీ షా (20: 21 బంతుల్లో 3x4), మయాంక్ అగర్వాల్ (32: 31 బంతుల్లో 6x4) ఆశించిన మేర ఆరంభం ఇవ్వలేకపోయారు. ఇద్దరికీ ఇదే అరంగేట్రం మ్యాచ్ కావడంతో ఒత్తిడి గురైన ఓపెనర్లు.. వరుస ఓవర్లలో పెవిలియన్‌కి చేరిపోయారు. దీంతో.. 8.4 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 54/2తో నిలిచింది.

Read More: కివీస్‌తో తొలి వన్డేలో భారత్‌ ఓపెనర్లు ఫెయిల్


ఓపెనర్లు ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జోడీ.. మూడో వికెట్‌కి ఏకంగా శతక భాగస్వామ్యంతో భారత్‌ని మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చింది. న్యూజిలాండ్ గడ్డపై తాజా పర్యటనలో తొలిసారి హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్న కోహ్లీ.. కసి మీద కనిపించాడు. కానీ.. ఇస్ సోధీ బౌలింగ్‌లో గూగ్లీని అర్థం చేసుకోలేకపోయిన కోహ్లీ.. జట్టు స్కోరు 156 వద్ద క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి భారత్ స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న శ్రేయాస్ అయ్యర్.. నెం.4లో తనని ఎవరూ సాటిరారు అనే తరహాలో సెంచరీ బాదేశాడు.

Read More: భారత్‌పై పాక్ క్రికెట్ వారసుల కామెడీ రనౌట్


కివీస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో తనని కవ్విస్తే..? అప్పర్ కట్‌లతో వారికి బదులిచ్చిన శ్రేయాస్ అయ్యర్.. కవర్ డ్రైవ్స్‌, కళ్లు చెదిరే సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శ్రేయాస్ అయ్యర్.. వన్డే కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసి జట్టు స్కోరు 292 వద్ద ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన కేదార్ జాదవ్ (26 నాటౌట్: 15 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి కేఎల్ రాహుల్ బ్యాట్ ఝళిపించడంతో భారత్ 347 పరుగుల మెరుగైన స్కోరు చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.