HBD MS Dhoni కెప్టెన్ మాత్రమే కాదు.. భారత క్రికెట్లో అంతకుమించి!
Happy Birthday MS Dhoni హ్యాష్టాగ్లో ట్విట్టర్ ఈరోజు హోరెత్తిపోతోంది. భారత్కి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. ఎంతో మంది యువ క్రికెటర్లని తన కెప్టెన్సీలో వెలుగులోకి తెచ్చాడు. దాంతో?
ప్రధానాంశాలు:
- 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనీ
- ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్లో కెప్టెన్ కూల్
- భారత్కి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్
- విజయవాడలో 41 అడుగుల కటౌట్
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు 41వ పడిలో అడుగుపెట్టాడు. ఝార్ఖండ్లోని రాంచీలో జులై 7, 1981లో జన్మించిన ధోనీ.. 2004లో భారత జట్టులోకి వికెట్ కీపర్గా ఎంట్రీ ఇచ్చాడు. అనతికాలంలోనే జట్టులో తిరుగులేని ఫినిషర్గా ఎదిగిన ధోనీ.. 2007లో కెప్టెన్గా టీమిండియాని టీ20 వరల్డ్కప్ 2007లో విజేతగా నిలిపి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత భారత క్రికెట్ సంధి దశలోనూ అద్భుతంగా జట్టుని తయారు చేసుకుని 2011 వన్డే ప్రపంచకప్లో టీమిండియాని విజేతగా నిలిపిన ధోనీ.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్కి అందించాడు. క్రికెట్ ప్రపంచంలో మూడు పెద్ద ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్గా ధోనీ ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాడు.
వికెట్ల వెనుక కూల్గా ఉండే ధోనీ.. బ్యాటర్ల కదలికల్ని నిశితంగా పరిశీలిస్తూ బౌలర్లకి సలహాలు ఇవ్వడమే కాదు.. బెయిల్స్ని రెప్పపాటులో ఎగరగొట్టేసేవాడు. ఇప్పటికీ.. క్రికెట్ ప్రపంచంలో వేగవంతంగా స్టంపౌట్ చేసే కీపర్ల జాబితాని పరిశీలిస్తే...? ధోనీ కచ్చితంగా టాప్లో ఉంటాడు. సుదీర్ఘ కెరీర్లో 350 వన్డేలు ఆడిన ధోనీ 50.58 సగటుతో 10,773 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 183 పరుగులు. అలానే 90 టెస్టులు ఆడిన ఈ మాజీ కెప్టెన్ 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ధోనీ చివర్లో రనౌట్గా వెనుదిరగగా.. భారత్ కూడా ఆ మ్యాచ్లో ఓడి ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉండిపోయిన ధోనీ.. 2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కి ఆడుతున్నాడు.
మహేంద్రసింగ్ ధోనీ తన 41వ పుట్టినరోజుని లండన్లో జరుపుకుంటున్నాడు. వింబుల్డన్ 2022 చూసేందుకు అక్కడికి ఫ్యామిలీతో కలిసి ధోనీ వెళ్లాడు. బెస్ట్ ఫినిషర్, బెస్ట్ వికెట్ కీపర్, బెస్ట్ కెప్టెన్గా ఇప్పటికే కితాబులు అందుకున్న ధోనీ.. చాలా మంది స్టార్ క్రికెటర్లకి కూడా ఆరాధ్యుడు. దాంతో.. ధోనీ పుట్టినరోజు శుభాకాంక్షలతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది. విజయవాడలో ధోనీ అభిమానులు 41 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు.
వికెట్ల వెనుక కూల్గా ఉండే ధోనీ.. బ్యాటర్ల కదలికల్ని నిశితంగా పరిశీలిస్తూ బౌలర్లకి సలహాలు ఇవ్వడమే కాదు.. బెయిల్స్ని రెప్పపాటులో ఎగరగొట్టేసేవాడు. ఇప్పటికీ.. క్రికెట్ ప్రపంచంలో వేగవంతంగా స్టంపౌట్ చేసే కీపర్ల జాబితాని పరిశీలిస్తే...? ధోనీ కచ్చితంగా టాప్లో ఉంటాడు. సుదీర్ఘ కెరీర్లో 350 వన్డేలు ఆడిన ధోనీ 50.58 సగటుతో 10,773 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 183 పరుగులు. అలానే 90 టెస్టులు ఆడిన ఈ మాజీ కెప్టెన్ 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ధోనీ చివర్లో రనౌట్గా వెనుదిరగగా.. భారత్ కూడా ఆ మ్యాచ్లో ఓడి ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉండిపోయిన ధోనీ.. 2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కి ఆడుతున్నాడు.
మహేంద్రసింగ్ ధోనీ తన 41వ పుట్టినరోజుని లండన్లో జరుపుకుంటున్నాడు. వింబుల్డన్ 2022 చూసేందుకు అక్కడికి ఫ్యామిలీతో కలిసి ధోనీ వెళ్లాడు. బెస్ట్ ఫినిషర్, బెస్ట్ వికెట్ కీపర్, బెస్ట్ కెప్టెన్గా ఇప్పటికే కితాబులు అందుకున్న ధోనీ.. చాలా మంది స్టార్ క్రికెటర్లకి కూడా ఆరాధ్యుడు. దాంతో.. ధోనీ పుట్టినరోజు శుభాకాంక్షలతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది. విజయవాడలో ధోనీ అభిమానులు 41 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు.