యాప్నగరం

ఛాంపియన్స్ ట్రోఫీ బ్రాండ్ అంబాసిడర్‌గా భజ్జీ

మరో 50 రోజుల్లో మొదలు కానున్న ఈ టోర్నీ కోసం ఐసీసీ 8 మంది క్రికెటర్లను ‘ఛాంపియన్ బ్రాండ్ అంబాసిడర్లు’గా నియమించింది. ఈ జాబితాలో భారత్ నుంచి హర్భజన్ సింగ్ చోటు దక్కించుకున్నాడు

TNN 12 Apr 2017, 2:17 pm
ఐపీఎల్ ముగిశాక ఛాంపియన్స్ ట్రోఫీ మజా ప్రారంభం కానుంది. మరో 50 రోజుల్లో మొదలు కానున్న ఈ టోర్నీ కోసం ఐసీసీ 8 మంది క్రికెటర్లను ‘ఛాంపియన్ బ్రాండ్ అంబాసిడర్లు’గా నియమించింది. ఈ జాబితాలో భారత్ నుంచి హర్భజన్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది, షేన్ బాండ్, హబీబుల్ బషర్, ఇయాన్ బెల్, కుమార సంగక్కర, గ్రేమ్ స్మిత్ తదితరులను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించింది.
Samayam Telugu harbhajan singh named ambassador for champions trophy along with 7 other former cricketers
ఛాంపియన్స్ ట్రోఫీ బ్రాండ్ అంబాసిడర్‌గా భజ్జీ


2002లో భారత్, శ్రీలంక జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో సంయుక్తంగా విజేతగా నిలిచాయి. సౌరభ్ గంగూలీ నాయకత్వంలోని నాటి భారత జట్టులో గంగూలీ సభ్యుడిగా ఉన్నాడు. తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల భజ్జీ సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా మరిన్ని లక్ష్యాలను సాధిస్తుందని ఈ సందర్భంగా టర్నోనేటర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.