ఐపీఎల్లో పదేళ్లపాటు మహేంద్రసింగ్ ధోనీకి ప్రత్యర్థిగా ఆడిన నేను మళ్లీ అతనితో కలిసి ఒకే జట్టులో ఆడి టైటిల్ గెలుస్తామని ఎవరూ ఊహించి ఉండరని చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి ముంబయి ఇండియన్స్కి ఆడిన హర్భజన్ సింగ్ను ఈ ఏడాది ఆ ఫ్రాంఛైజీ వదులుకోవడంతో వేలంలో చెన్నై కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వాంఖడే వేదికగా గత ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వాట్సన్ శతకం బాదడంతో అలవోకగా గెలుపొందిన చెన్నై మూడో టైటిల్ను చేజిక్కించుకుంది. వాంఖడే వేదికగానే 2011లో శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ గెలుపొందగా.. ఆ జట్టులోనూ తాను ఉన్నానని.. ఆ స్టేడియం మా ఇద్దరికీ కలిసొచ్చిందని భజ్జీ చెప్పుకొచ్చాడు.
‘2011 వరల్డ్ కప్ గెలిచిన మైదానంలో మళ్లీ మేము ఐపీఎల్ టైటిల్ గెలిచాం. పదేళ్లు ప్రత్యర్థులుగా ఆడిన మేము.. మళ్లీ ఒకే జట్టుకి ఆడతామని.. టైటిల్ గెలుస్తామని ఎవరూ ఊహించి ఉండరు. వాంఖడే స్టేడియం మా ఇద్దరికీ కలిసొచ్చింది కదా..? ’ అని హర్భజన్ సింగ్ సరదాగా ప్రశ్నించాడు. భారత జట్టుకి మహేంద్రసింగ్ ధోనీ కారణంగానే హర్భజన్ సింగ్ దూరమయ్యాడనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. వాటికి బలం చేకూరుస్తూ.. గత మూడు ఐపీఎల్ సీజన్లలో ధోనీ వికెట్ పడిన సమయంలో భజ్జీ మితిమీరిన సంబరాలు చేసుకున్నాడు. దీంతో.. వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయని అంతా భావించారు. కానీ.. ఈ ఏడాది మైదానంలో వీరిద్దరూ సాన్నిహిత్యంగా మెలిగి.. విమర్శకుల నోళ్లు మూయించారు.
‘2011 వరల్డ్ కప్ గెలిచిన మైదానంలో మళ్లీ మేము ఐపీఎల్ టైటిల్ గెలిచాం. పదేళ్లు ప్రత్యర్థులుగా ఆడిన మేము.. మళ్లీ ఒకే జట్టుకి ఆడతామని.. టైటిల్ గెలుస్తామని ఎవరూ ఊహించి ఉండరు. వాంఖడే స్టేడియం మా ఇద్దరికీ కలిసొచ్చింది కదా..? ’ అని హర్భజన్ సింగ్ సరదాగా ప్రశ్నించాడు. భారత జట్టుకి మహేంద్రసింగ్ ధోనీ కారణంగానే హర్భజన్ సింగ్ దూరమయ్యాడనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. వాటికి బలం చేకూరుస్తూ.. గత మూడు ఐపీఎల్ సీజన్లలో ధోనీ వికెట్ పడిన సమయంలో భజ్జీ మితిమీరిన సంబరాలు చేసుకున్నాడు. దీంతో.. వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయని అంతా భావించారు. కానీ.. ఈ ఏడాది మైదానంలో వీరిద్దరూ సాన్నిహిత్యంగా మెలిగి.. విమర్శకుల నోళ్లు మూయించారు.