యాప్నగరం

శ్రీలంకతో టెస్టు సిరీస్: పాండ్యకు విశ్రాంతి

లంకతో సిరీస్‌కు పాండ్యకు విశ్రాంతినిచ్చిన సెలక్షన్ కమిటీ. కీలక దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

TNN 10 Nov 2017, 5:25 pm
శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇటీవలి కాలంలో మితిమీరిన క్రికెట్ ఆడుతున్నందున మూడు టెస్టుల సిరీస్‌కి పాండ్యను ఎంపిక చేయలేదు. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటన ఉండటంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేసే విషయంలో మాత్రం బోర్డు స్పష్టత ఇవ్వలేదు. తొలుత 16 మంది ప్రాబబుల్స్ జాబితాలో పాండ్య పేరు ఉన్నప్పటికీ.. సెలక్షన్ కమిటీ పాండ్యకు విశ్రాంతినిస్తూ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu hardik pandya to be rested during sri lanka test series report
శ్రీలంకతో టెస్టు సిరీస్: పాండ్యకు విశ్రాంతి


ఈ విరామం సమయంలో పాండ్య తన ఆటతీరును మరింత మెరుగు పరచుకునేలా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందనున్నాడు. జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన అనంతరం సెలక్షన్ కమిటీ పాండ్యకు విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

NEWS - #TeamIndia all-rounder Hardik Pandya has been rested from the upcoming Test series against Sri Lanka. More updates here - https://t.co/GjxJxyGqhv pic.twitter.com/FLxQo8wKvl — BCCI (@BCCI) November 10, 2017
హార్దిక్ పాండ్య శ్రీలంకపైనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. పల్లెకెలెలో జరిగిన మూడో టెస్టులో తొలి సెంచరీ నమోదు చేశాడు. లంక జట్టు భారత గడ్డ మీద మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇటీవలే శ్రీలంక‌లో జరిగిన సిరీస్‌లో భారత్ 9-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.