యాప్నగరం

భారత్ జట్టుకి ఇప్పుడు అదే పెద్ద లోటు: హస్సీ

హార్దిక్ పాండ్య చాలా ప్రతిభ ఉన్న ఆటగాడు. ఇంకా చెప్పాలంటే.. ఆస్ట్రేలియా పిచ్‌లకి అతని ఆట చక్కగా సరిపోతుంది. ఒకవేళ అతను జట్టులో ఉండింటే.. కచ్చితంగా టీమిండియాకి అదనపు బలం చేకూరేది.

Samayam Telugu 16 Nov 2018, 7:22 pm
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టుకి గట్టి పోటీతప్పదని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ అభిప్రాయపడ్డాడు. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం వేటు పడటంతో స్టార్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్‌లు జట్టుకి దూరమైనా.. సొంతగడ్డపై ఆసీస్ ఎప్పుడూ బలమైన జట్టేనని హస్సీ చెప్పుకొచ్చాడు. మరోవైపు భారత్ జట్టు‌‌లో కూడా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య లేకపోవడం పెద్ద లోటుగా అభివర్ణించిన ఈ మాజీ క్రికెటర్.. ఆసీస్ బౌలర్ల నుంచి టీమిండియా బ్యాట్స్‌మెన్‌కి కఠిన సవాల్ తప్పవని హెచ్చరించాడు.
Samayam Telugu aa-Cover-uitjtt7mubb14ev3gmh75qaqv4-20180505123120.Medi.


‘హార్దిక్ పాండ్య చాలా ప్రతిభ ఉన్న ఆటగాడు. ఇంకా చెప్పాలంటే.. ఆస్ట్రేలియా పిచ్‌లకి అతని ఆట చక్కగా సరిపోతుంది. ఒకవేళ అతను జట్టులో ఉండింటే.. కచ్చితంగా టీమిండియాకి అదనపు బలం చేకూరేది. ఇప్పుడు గాయం కారణంగా హార్దిక్ దూరమవడం భారత్ జట్టు‌‌కి తీరని లోటు. మెరుగైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడం అంత సులువు కాదని నా అభిప్రాయం. మరోవైపు ఆసీస్ బౌలింగ్ ఎటాక్ ప్రపంచంలోనే అత్యుత్తమం. కచ్చితంగా వారి నుంచి భారత్ బ్యాట్స్‌మెన్‌కి సవాల్ తప్పదు. దీనికి తోడు.. సొంతగడ్డపై ఆడుతుండటం ఆస్ట్రేలియాకి కలిసొచ్చే అంశం’ అని మైకేల్ హస్సీ ధీమా వ్యక్తం చేశాడు.

ఈనెల 21 నుంచి భారత్ జట్టు ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.