యాప్నగరం

​ అయ్యో.. ఉత్తినే 100 రన్స్ ఇచ్చేశాం..?

మ్యాచ్ జరిగేకొద్దీ పల్లెకలె పిచ్ పేలవంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకునేందుకు

TNN 14 Aug 2017, 8:52 pm
Samayam Telugu hardiks innings changed the mindset of the opposition kohli
​ అయ్యో.. ఉత్తినే 100 రన్స్ ఇచ్చేశాం..?
పల్లెకలె టెస్టులో హార్దిక్ పాండ్య హిట్టింగ్ కారణంగా.. శ్రీలంక జట్టు రెండో రోజే ఆత్మరక్షణలో పడిపోయిందని భారత్ కెప్టెన్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. సోమవారం ముగిసిన ఈ మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 177 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. పిచ్ మూడో రోజు మరీ పేలవంగా తయారైందని.. దీంతో బ్యాటింగ్ చేయడం కఠినంగా మారినట్లు కోహ్లి వివరించాడు.

‘మ్యాచ్ జరిగేకొద్దీ పల్లెకలె పిచ్ పేలవంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకునేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. కొన్ని బంతులైతే.. బ్యాట్స్‌మెన్‌పైకి ప్రమాదకరరీతిలో దూసుకెళ్లాయి. అందుకే తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 487 పరుగులే భారత్‌కి చాలనే నేను అనుకున్నా. రెండో రోజే హార్దిక్ పాండ్య హిట్టింగ్ లంకేయుల్ని ఒత్తిడిలోకి నెట్టింది. ఒకానొక సమయంలో 320/6తో నిలిచిన టీమిండియాని మరో అరవై పరుగులోపే కట్టడి చేయగలమని భావించిన శ్రీలంకకి హార్దిక్ పాండ్య శతకంతో షాకిచ్చాడు. దీంతో వారు ఊహించిన దానికంటే 100 పరుగులు ఎక్కువ ఇచ్చేశామని ఆందోళన చెందారు. ఇదే వారిని ఒత్తిడిలోకి నెట్టేసింది’ అని కోహ్లి వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.