యాప్నగరం

నిర్లక్ష్యపు హెచ్‌సీఏ: మరోసారి అదే తీరు!

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మరో అపప్రదను మూటగట్టుకుంది. వర్షం కురవకపోయినా.. మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో మరో మ్యాచ్‌ రద్దైంది. హైదరాబాద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ జట్ల మధ్య జింఖానా గ్రౌండ్స్‌లో జరగాల్సిన రంజీ ట్రోఫీ గ్రూపు-ఎ మ్యాచ్‌‌కు కూడా రద్దు పోటు తప్పలేదు..

TNN 18 Oct 2017, 7:12 pm
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మరో అపప్రదను మూటగట్టుకుంది. ఇటీవలే ఇండియా - ఆస్ట్రేలియా మధ్య కీలక టీ20 మ్యాచ్‌ సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌సీఏ ఖాతాలో మరో వైఫల్యం చేరింది. వర్షం కురవకపోయినా.. మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో మరో మ్యాచ్‌ రద్దైంది. తాజాగా హైదరాబాద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ జట్ల మధ్య జింఖానా గ్రౌండ్స్‌లో జరగాల్సిన రంజీ ట్రోఫీ గ్రూపు-ఎ మ్యాచ్‌‌కు కూడా రద్దు పోటు తప్పలేదు. వరసగా నాలుగో రోజూ ఆట సాధ్యం కాకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం (అక్టోబర్ 17) ప్రకటించారు.
Samayam Telugu hcas another neglect ranji match cancelled
నిర్లక్ష్యపు హెచ్‌సీఏ: మరోసారి అదే తీరు!


ఆట రెండో రోజైన ఆదివారం ఉదయం నుంచి వర్షం పడకపోయినా మైదానాన్ని ఆటకు సిద్ధం చేయకపోవడం గమనార్హం. ఆదివారం, సోమవారం బాగా ఎండ కాసినప్పటికీ.. మైదానం అక్కడక్కడా చిత్తడిగా ఉండటంతో ఆటగాళ్లు విస్తూ పోయారు. హెచ్‌సీఏ పెద్దలు ఇప్పటికైనా మైదానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.