యాప్నగరం

హాకీ వరల్డ్‌కప్‌లో భారత్‌కి రేపు కఠిన పరీక్ష..!

ఇప్పటి వరకు రెండు జట్లూ 19 సార్లు తలపడగా.. భారత్ గెలిచిన మ్యాచ్‌లు ఐదుకాగా.. బెల్జియం 13 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది.

Samayam Telugu 1 Dec 2018, 5:26 pm
ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌లో ఘన విజయంతో బోణి కొట్టిన భారత్ జట్టుకి ఆదివారం కఠిన సవాల్ ఎదురుకానుంది. టోర్నీలో మొదటిరోజైన గురువారం దక్షిణాఫ్రికాని 5-0 తేడాతో చిత్తుగా ఓడించిన భారత్ జట్టు.. ఆదివారం రెండో మ్యాచ్‌లో బెల్జియంతో ఢీకొననుంది.
Samayam Telugu 80


2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన బెల్జియం జట్టు ప్రస్తుతం భారత్‌తో పోలిస్తే బలంగా కనిపిస్తోంది. కెనడాతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలిచిన ఆ జట్టు ఇప్పుడు మంచి జోరుమీదుంది.

రికార్డుల పరంగా చూసినా.. భారత్‌పై బెల్జియం టీమ్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రెండు జట్లూ 19 సార్లు తలపడగా.. భారత్ గెలిచిన మ్యాచ్‌లు ఐదుకాగా.. బెల్జియం 13 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో.. రేపు బెల్జియం టీమ్‌ని ఓడించడం భారత్‌కి సవాలే..! ఆదివారం రాత్రి 7 గంటలకి మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.