ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటించడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ క్లారిటీ ఇచ్చేశాడు. ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాకి వెళ్లిన ఏబీ డివిలియర్స్.. అనూహ్యరీతిలో ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. కానీ.. ఆ తర్వాత ఏడాది నుంచి ఆ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకునేందుకు ఏబీ డివిలియర్స్ ప్రయత్నాలు చేయగా.. తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో.. రిటైర్మెంట్ని వెనక్కి తీసుకునే ఆలోచన ఇక లేదని ఈ ఏడాది ఏబీడీ స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి రీస్టార్ట్ కాబోతుండగా.. ఈ సీజన్ ముగిసిన తర్వాత ఏబీడీ ఐపీఎల్కి కూడా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇదే విషయాన్ని ఏబీడీని అడగా.. అతను సమాధానమిచ్చాడు. ఐపీఎల్లో ఆడి కనీసం ఒకటి లేదా రెండు రికార్డ్ల్ని బ్రేక్ చేయాలి.. ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. కాబట్టి.. మరి కొన్నేళ్ల పాటు ఐపీఎల్లో బెంగళూరు తరఫున ఆడతాను అని 37ఏళ్ల ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021 సీజన్ గత మే నెలలో వాయిదాపడే సమయానికి బెంగళూరు తరఫున ఏడు మ్యాచ్లాడిన ఏబీ డివిలియర్స్ 207 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఏబీడీ స్ట్రైక్రేట్ 160కిపైగా ఉండటం విశేషం. మొత్తంగా 176 మ్యాచ్లాడిన డివిలియర్స్ 5056 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2021 సీజన్ గత మే నెలలో వాయిదాపడే సమయానికి బెంగళూరు తరఫున ఏడు మ్యాచ్లాడిన ఏబీ డివిలియర్స్ 207 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఏబీడీ స్ట్రైక్రేట్ 160కిపైగా ఉండటం విశేషం. మొత్తంగా 176 మ్యాచ్లాడిన డివిలియర్స్ 5056 పరుగులు చేశాడు.