యాప్నగరం

కోహ్లిని తిట్టారు కదా.. ఇప్పుడేమంటారు..?

మైదానంలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడు‌పై అప్పట్లో పెదవి విరిచారు కదా.. ఇప్పుడు జట్టులోని క్రికెటర్లందరూ అదే

TNN 24 Oct 2017, 10:39 am
మైదానంలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడు‌పై అప్పట్లో పెదవి విరిచారు కదా.. ఇప్పుడు జట్టులోని క్రికెటర్లందరూ అదే రీతిలో ఆట ఆడుతున్నారు ఇప్పుడేమంటారు..? అంటూ సచిన్ తెందుల్కర్ విమర్శకుల్ని ప్రశ్నించాడు. జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రాసిన ‘డెమోక్రసీస్‌ ఎలెవన్‌ - ద గ్రేట్‌ ఇండియన్‌ క్రికెట్‌ స్టోరీ’ పుస్తక ఆవిష్కరణ‌ కార్యక్రమానికి హాజరైన సచిన్ ప్రస్తుత టీమిండియా ఆట తీరు గురించి మాట్లాడాడు. న్యూజిలాండ్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండో వన్డే పుణె వేదికగా బుధవారం జరగనుంది.
Samayam Telugu how an aggressive virat kohli became team indias strength explains sachin tendulkar
కోహ్లిని తిట్టారు కదా.. ఇప్పుడేమంటారు..?


‘భారత్ జట్టులోకి అరంగేట్రం చేసినప్పటి నుంచే విరాట్ కోహ్లి మైదానంలో చాలా దూకుడుగా ఉండేవాడు. అప్పట్లో అతని తీరు కొంత మందికి అసలు నచ్చేది కాదు. కొందరైతే.. బహిరంగంగానే పెదవి విరిచారు. కానీ.. కోహ్లి మాత్రం వెనక్కి తగ్గలేదు. అదే దూకుడుని ఇప్పటికీ జట్టులో కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆ దూకుడు‌ క్రమంగా భారత్ జట్టు మొత్తానికీ అలవాటైంది. దానికి నిదర్శనమే ఇటీవల భారత్ జట్టు సాధిస్తున్న వరుస సిరీస్ విజయాలు’ అని సచిన్ తెందుల్కర్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.