నేను విఫలం అవుతుండొచ్చు. కానీ తప్పకుండా 2019 ప్రపంచకప్ ఆడతా. ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. నేటి తరం పిల్లలను ఆటలు ఎలా తీర్చిదిద్దుతాయనే అంశంపై యూనిసెఫ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యువీ భావోద్వేగంగా ప్రసంగించాడు. నేను ఫెయిల్ అవుతున్నా. ఇప్పటికీ విఫలం అవుతున్నా. 17 ఏళ్ల తర్వాత కూడా విఫలం అవుతున్నా, కానీ నిన్న ఫిట్నెస్ టెస్టులో పాసయ్యానని యువరాజ్ తెలిపాడు.
‘వైఫల్యాలకు భయపడను. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. ఓటములే విజయానికి మెట్లని నమ్ముతాన’ని యువీ చెప్పాడు. జీవితంలో విజయం సాధించాలంటే.. ఓడిపోవాలి. ఓటములు ఎదురైతేనే మనిషి బలవంతుడు అవుతాడు. తర్వాతి స్థాయికి చేరుకుంటాడని కేన్సర్ను జయించిన ఈ క్రికెటర్ భావోద్వేగంగా మాట్లాడాడు.
‘నా పట్ల ఎంత మందికి నమ్మకం ఉందో తెలీదు. కానీ నాపై నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. నేను ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నా. ఫార్మాట్ ఏదైనా కావచ్చు ఆట మాత్రం ఆడుతూనే ఉన్నా. రోజూ ఎంతో శ్రమిస్తున్నా. వయసు పై బడుతోంది కదా.. అందుకే గతంలో కంటే ఎక్కువగానే కష్ట పడుతున్నా. 2019 వరకూ క్రికెట్ ఆడుతా. తర్వాత తప్పకుండా గుడ్ బై చెబుతా’నని 36 ఏళ్ల యువీ చెప్పాడు.
2011లో భారత జట్టు సొంత గడ్డ మీద ప్రపంచ కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్.. ప్రస్తుతం జట్టులో చోటు దక్కించుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. టీమిండియా క్రికెటర్లకు తప్పనిసరైన యో-యో ఫిట్నెస్ టెస్టులో చాలా సార్లు విఫలమయ్యాడు. దీంతో యో-యో టెస్టును సిరీయస్గా తీసుకున్న యువీ.. రంజీ మ్యాచ్లు ఆడకుండా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. ఈ విషయం వివాదాస్పదం అయినప్పటికీ.. యువీ మాత్రం ఎట్టకేలకు ఈ టెస్టులో పాసయ్యాడు.
ఇప్పటి వరకూ యువీ 17 ఏళ్ల కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 1900 పరుగులు, వన్డేల్లో 8701 రన్స్, టీ20ల్లో 1177 పరుగులు చేశాడు.
‘వైఫల్యాలకు భయపడను. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. ఓటములే విజయానికి మెట్లని నమ్ముతాన’ని యువీ చెప్పాడు. జీవితంలో విజయం సాధించాలంటే.. ఓడిపోవాలి. ఓటములు ఎదురైతేనే మనిషి బలవంతుడు అవుతాడు. తర్వాతి స్థాయికి చేరుకుంటాడని కేన్సర్ను జయించిన ఈ క్రికెటర్ భావోద్వేగంగా మాట్లాడాడు.
‘నా పట్ల ఎంత మందికి నమ్మకం ఉందో తెలీదు. కానీ నాపై నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. నేను ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నా. ఫార్మాట్ ఏదైనా కావచ్చు ఆట మాత్రం ఆడుతూనే ఉన్నా. రోజూ ఎంతో శ్రమిస్తున్నా. వయసు పై బడుతోంది కదా.. అందుకే గతంలో కంటే ఎక్కువగానే కష్ట పడుతున్నా. 2019 వరకూ క్రికెట్ ఆడుతా. తర్వాత తప్పకుండా గుడ్ బై చెబుతా’నని 36 ఏళ్ల యువీ చెప్పాడు.
2011లో భారత జట్టు సొంత గడ్డ మీద ప్రపంచ కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్.. ప్రస్తుతం జట్టులో చోటు దక్కించుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. టీమిండియా క్రికెటర్లకు తప్పనిసరైన యో-యో ఫిట్నెస్ టెస్టులో చాలా సార్లు విఫలమయ్యాడు. దీంతో యో-యో టెస్టును సిరీయస్గా తీసుకున్న యువీ.. రంజీ మ్యాచ్లు ఆడకుండా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. ఈ విషయం వివాదాస్పదం అయినప్పటికీ.. యువీ మాత్రం ఎట్టకేలకు ఈ టెస్టులో పాసయ్యాడు.
ఇప్పటి వరకూ యువీ 17 ఏళ్ల కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 1900 పరుగులు, వన్డేల్లో 8701 రన్స్, టీ20ల్లో 1177 పరుగులు చేశాడు.