యాప్నగరం

విరాట్ కోహ్లీ ఎంపిక కోసం పోరాడా: అతుల్

ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటైపోయాడు. అతనితో పాటు అదే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇషాంత్ శర్మ మాత్రం నాలుగు వికెట్లతో మెరిశాడు.

Samayam Telugu 21 Sep 2018, 10:15 pm
రంజీల్లో ఢిల్లీ జట్టు‌కి విరాట్ కోహ్లీని ఎంపిక చేసేందుకు అప్పట్లో తాను చాలా పోరాడాల్సి వచ్చిందని మాజీ ఫాస్ట్‌ బౌలర్, ఢిల్లీ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్ అతుల్ వాసన్ వెల్లడించాడు. 2006 నవంబరులో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటైపోయాడు. అతనితో పాటు అదే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇషాంత్ శర్మ మాత్రం నాలుగు వికెట్లతో మెరిశాడు. కానీ.. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జట్టుని విజేతగా నిలిపిన కోహ్లీ.. అనతికాలంలో టీమిండియాలోకి అడుగుపెట్టాడు.
Samayam Telugu London: India captain Virat Kohli lies on the pitch after fielding a ball in the...
India captain Virat Kohli lies on the pitch after fielding a ball in the slips during the fifth cricket test match of a five match series between England and India at the Oval cricket ground in London. AP/PTI


‘ఢిల్లీ మేనేజ్‌మెంట్ అప్పట్లో విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మని జట్టులోకి తీసుకునేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే.. అప్పట్లో వారు అండర్-19‌కి ఆడేవారు. కానీ.. వారిద్దరూ ఢిల్లీ జట్టుకి రంజీల్లో ఆడాలని నేను పట్టుబట్టి.. పోరాడి ఎంపిక చేశాను. ఆ తర్వాత వారు ఏ స్థాయికి చేరుకున్నారో మీరే చూస్తున్నారు. 11 ఏళ్ల వయసులోనే విరాట్ కోహ్లీ నా అకాడమీకి వచ్చాడు. అప్పటి నుంచి అతని ఆటని నేను గమనిస్తూ వచ్చాను’ అని అతుల్ వాసన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.