యాప్నగరం

గంభీర్‌తో గొడవ నాకిప్పటికీ అర్థం కాలేదు..?

మనోజ్ తివారి.. తొలి బంతిని ఎదుర్కొనే ముందు.. హెల్మెట్ తీసుకురావాల్సిందిగా పెవిలియన్‌లోని సహచరుడ్ని పిలిచాడు.

TNN 28 Jun 2017, 5:02 pm
మైదానంలో రెండేళ్ల క్రితం భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌తో గొడవ తనకిప్పటికీ అర్థం కావడంలేదని బెంగాల్ రంజీ జట్టు కెప్టెన్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున మెరుగ్గా రాణించిన 34 ఏళ్ల తివారీ మళ్లీ భారత్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించాడు.
Samayam Telugu i never understood what actually happened between me and gauti
గంభీర్‌తో గొడవ నాకిప్పటికీ అర్థం కాలేదు..?


కొద్ది రోజుల్లోనే రంజీ మ్యాచ్‌లు ఆరంభంకానున్న నేపథ్యంలో మీడియాతో తివారీ మాట్లాడాడు. ఈ సందర్భంగా గంభీర్‌తో గొడవ గురించి ప్రశ్నించగా.. ‘ఆ రోజు మైదానంలో గంభీర్‌కి నాకు మధ్య ఏం జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు’ అని సమాధానం దాటవేశాడు. 2015లో ఫిరోజ్ షా కోట్ల‌‌లో ఢిల్లీ, బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ గొడవైంది. ఆ మ్యాచ్‌లో వికెట్ పడిన అనంతరం క్రీజులోకి వచ్చిన మనోజ్ తివారి.. తొలి బంతిని ఎదుర్కొనే ముందు.. హెల్మెట్ తీసుకురావాల్సిందిగా పెవిలియన్‌లోని సహచరుడ్ని పిలిచాడు. దీనిపై అప్పటి ఢిల్లీ కెప్టెన్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘హెల్మెట్ లేకుండా ఎలా బ్యాటింగ్‌కి వస్తావు’ అని గొడవకి దిగాడు. మ్యాచ్ సమయాన్ని వృథా చేసేందుకే తివారీ అలా చేశాడని గంభీర్ ఆరోపించాడు.

ఈ గొడవ తీవ్రస్థాయికి వెళ్లి.. మైదానంలో ఒకరికొకరు సవాళ్లు కూడా విసురుకున్నారు. ‘సాయంత్రం నీ అంతు చూస్తా’నని.. గంభీర్ హెచ్చరించగా.. ‘అప్పటి వరకు ఎందుకు ఇప్పుడే మైదానం వెలుపలకి రా చూస్కుందాం’ అంటూ మనోజ్ తివారీ ధీటుగా బదులిచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.