యాప్నగరం

కోహ్లీ కోసమే కెప్టెన్సీ వదిలేశా..! : ధోని

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి కొద్దిరోజుల ముందు అనూహ్యంగా నాయకత్వ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా.. అతని స్థానంలో కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Samayam Telugu 13 Sep 2018, 3:49 pm
విరాట్ కోహ్లీ కోసమే తాను వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి స్పష్టం చేశాడు. గత ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి కొద్దిరోజుల ముందు అనూహ్యంగా నాయకత్వ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా.. అతని స్థానంలో కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కొత్త కెప్టెన్‌‌కి 2019 ప్రపంచకప్‌‌ కోసం మెరుగైన జట్టుని సిద్ధం చేసుకునే వెసులబాటు, సమయం ఇచ్చేందుకే తాను అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ వెల్లడించాడు.
Samayam Telugu main-qimg-a51f04f9dc252fd9c4dd68c615c95feb-c.


‘ప్రపంచకప్‌ కోసం భారత జట్టుని సిద్ధం చేసుకునే వెసులబాటు.. కొత్త కెప్టెన్‌కి ఇవ్వాలనే ఉద్దేశంతో వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి అప్పట్లో వైదొలిగా. ఒకవేళ కొత్త కెప్టెన్‌‌కి తగిన సమయం మనం ఇవ్వలేకపోతే ప్రపంచకప్‌ కోసం మెరుగైన జట్టుని తయారు చేసుకోలేడు. అందుకే.. సరైన సమయంలోనే కెప్టెన్నీ నుంచి తప్పుకున్నానని నేను ఇప్పటికీ నమ్ముతున్నా’ అని ధోనీ వెల్లడించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ భారత జట్టుని విజేతగా నిలిపిన మహేంద్రసింగ్ ధోనీ.. విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.