యాప్నగరం

2020 టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడాలి..!

2020 టీ20 ప్రపంచకప్‌‌‌లో ఆడే సత్తా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని‌లో ఉందని మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా విశ్వాసం వ్యక్తం చేశాడు.

TNN 8 Nov 2017, 10:25 pm
2020 టీ20 ప్రపంచకప్‌‌‌లో ఆడే సత్తా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని‌లో ఉందని మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లో ధోనీ విఫలమవడంతో అతను ఇక జట్టు నుంచి పక్కకి తప్పుకోవాలని అంతా సూచిస్తున్నారు. తాను జట్టుకి ఉపయోగపడని ధోనీ భావిస్తే నిజాయతీగా వీడ్కోలు చెప్పేస్తాడని నెహ్రా వివరించాడు. కేవలం ఒకటి లేదా రెండు సిరీస్‌ల గణాంకాలు ఆధారంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోమని చెప్పడం భావ్యం కాదని సూచించాడు.
Samayam Telugu i see ms dhoni playing 2020 world t20 says ashish nehra
2020 టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడాలి..!


‘ప్రతి ఇంటికి ఒకరు పెద్ద కావాలి. అలానే జట్టులో ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోనీ ఉన్నాడు. నా అంచనా ప్రకారం మరో రెండు లేదా మూడేళ్లు శరీరం సహకరిస్తే అతను క్రికెట్ ఆడతాడు. ఒకవేళ అతను జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే నిజాయతీగా పక్కకి తప్పుకుంటాడు. కానీ.. ప్రస్తుతం అతడ్ని స్వేచ్ఛగా ఆట ఆస్వాదించనివ్వండి. ఎందుకంటే అతను దేశం కోసం ఏ త్యాగానికైన వెనకాడబోడు. నా అంచనా ప్రకారం ధోనీ కచ్చితంగా 2020 టీ20 ప్రపంచకప్ కూడా ఆడతాడు. 39 ఏళ్ల వయసు వచ్చే వరకూ నాలాంటి ఒక ఫాస్ట్ బౌలర్ క్రికెట్ ఆడగా లేనిది.. ఇప్పటికీ మంచి ఫిటెనెస్‌తో ఉన్న ధోనీ టీ20, వన్డేలు
ఆడేందుకు అర్హుడే..!’ అని ఆశిష్ నెహ్రా వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.