యాప్నగరం

MS Dhoni కెరీర్ ఇప్పుడు కోహ్లీ చేతిలో..! : రైనా

మహేంద్రసింగ్ ధోనీ అవసరం టీమిండియాకి ఇప్పటికీ ఉంది. కాబట్టి.. కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకోబోయే నిర్ణయంపై ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్ ఆధారపడి ఉంది - సురేశ్ రైనా

Samayam Telugu 24 Jan 2020, 11:38 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల్లో ఉందని టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో సర్జరీ చేయించుకున్న సురేశ్ రైనా.. అప్పటి నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఆడటమే తన లక్ష్యమని వెల్లడించాడు. అలానే ధోనీ కెరీర్ గురించి కూడా మాట్లాడిన రైనా.. కెప్టెన్ కోహ్లీనే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించాడు.
Samayam Telugu i still think indian team needs ms dhoni says suresh raina
MS Dhoni కెరీర్ ఇప్పుడు కోహ్లీ చేతిలో..! : రైనా


Read More: ఈరోజే IND vs NZ 1st T20.. కివీస్ గడ్డపై కోహ్లీసేనకి సవాల్.. టీ20 రికార్డ్స్‌తో బెంగ
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న సురేశ్ రైనా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆశిస్తున్నా. ఎందుకంటే..? మరో 2-3 ఏళ్లు క్రికెట్ ఆడగలనని నాకు తెలుసు. కాబట్టి.. ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించగలిగితే..? అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్‌కప్ రేసులో నేనూ నిలవొచ్చు. ధోనీ కూడా ఐపీఎల్ కోసం మార్చి తొలి వారంలో చెన్నైలో నిర్వహించే ప్రాక్టీస్ సెషన్స్‌కి హాజరుకానున్నాడు. టీమిండియాలోకి అతని రీఎంట్రీ అంటారా..? అది ఇప్పుడు పూర్తిగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. భారత జట్టుకి కూడా అతని సేవలు అవసరం’ అని రైనా వెల్లడించాడు.

Read More: రోహిత్ శర్మ డిఫెన్స్, కోహ్లీ హిట్టింగ్.. కివీస్‌తో టీ20లకి భారత్ కొత్త వ్యూహం

2018, జులైలో భారత్ తరఫున ఆఖరిగా టీ20ల్లో ఆడిన సురేశ్ రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు. గత ఏడాది నెం.4 కోసం రైనా పేరుని కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ పరిశీలించింది. కానీ.. గాయం కారణంగా అతను రేసు నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ రూపంలో నెం.4లో సమర్థంగా ఆడగలిగితే బ్యాట్స్‌మెన్ టీమిండియాకి దొరికాడు. ఈ నేపథ్యంలో.. సురేశ్ రైనా.. ఐపీఎల్ 2020లో మెరుగ్గా రాణించి మళ్లీ రేసులోకి రావాలని ఆశిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.