యాప్నగరం

Shikhar Dhawan నెక్ట్స్ టార్గెట్ వరల్డ్‌కప్.. గబ్బర్ మనసులో మాట

IND vs SA 1st ODI కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన శిఖర్ ధావన్.. తన భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా పెదవి విప్పాడు. వచ్చే ఏడాది భారత్‌లోనే వన్డే ప్రపంచకప్ జరగనుండగా..?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 5 Oct 2022, 8:03 pm

ప్రధానాంశాలు:

  • దక్షిణాఫ్రికాతో గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలు
  • కెప్టెన్‌గా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన శిఖర్ ధావన్
  • ఈరోజు లక్నోలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు
  • తన నెక్ట్స్ టార్గెట్ ఏంటో చెప్పిన గబ్బర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Shikhar Dhawan
శిఖర్ ధావన్ (Pic Credit: AP)
భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా గురువారం నుంచి భారత్ వన్డే జట్టుని నడిపించబోతున్నాడు. దక్షిణాఫ్రికాతో రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియా ఆడనుండగా.. ఈ సిరీస్‌కి కెప్టెన్‌గా గబ్బర్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత టీ20 జట్టు టీ20 వరల్డ్‌కప్ 2022 కోసం ఈ వారంలోనే ఆస్ట్రేలియాకి వెళ్లబోతోంది. దాంతో యువ ఆటగాళ్లతో నిండిన వన్డే జట్టు సఫారీలతో ఢీకొట్టబోతోంది.
లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకి ఫస్ట్ వన్డే జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే భారత జట్టు అక్కడికి చేరుకుంది. కానీ ఈరోజు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో కెప్టెన్‌ హోదాలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన శిఖర్ ధావన్.. తన భవిష్యత్ ప్రణాళికల్ని కూడా మీడియాతో పంచుకున్నాడు. ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ 2022కి శిఖర్ ధావన్ ఎంపికవని విషయం తెలిసిందే.

‘‘ఇప్పుడు నా లక్ష్యం 2023 వన్డే ప్రపంచకప్. ఆ టోర్నీ సమయానికి పూర్తిగా మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతానికి నాకు అవకాశం దొరికినప్పుడల్లా యువ ఆటగాళ్లకి నాలెడ్జ్ పంచుతున్నా. ఇప్పుడు ఈ వన్డే సిరీస్‌లో కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈ సవాల్‌ని నేను సంతోషంగా స్వీకరిస్తాను’’ అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా టీ20లు, టెస్టులకి దూరంగా ఉంటున్న గబ్బర్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.