యాప్నగరం

టీమిండియా‌కి మళ్లీ ఆడతా : మురళీ విజయ్

జట్టులో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌ రూపంలో ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీ ఎదుర్కొంటున్న 34 ఏళ్ల మురళీ విజయ్‌‌కి మరో పోటీగా వచ్చిన యువ ఓపెనర్ పృధ్వీ షా‌

Samayam Telugu 2 Sep 2018, 4:59 pm
భారత్ జట్టు తరఫున టెస్టుల్లోకి మళ్లీ‌ తాను పునరాగమనం చేస్తానని ఓపెనర్ మురళీ విజయ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన మురళీ విజయ్‌పై ఇటీవల వేటు వేసిన సెలక్టర్లు అతని స్థానంలో యువ ఓపెనర్ పృధ్వీ షా‌‌కి జట్టులో అవకాశం కల్పించారు. ఇప్పటికే జట్టులో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌ రూపంలో ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీ ఎదుర్కొంటున్న 34 ఏళ్ల మురళీ విజయ్‌ కెరీర్‌.. తాజాగా పృధ్వీ షా‌ రాకతో ఇక ముగిసిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మురళీ విజయ్ మీడియాతో ఆదివారం మాట్లాడాడు.
Samayam Telugu LONDON: Indias Murali Vijay is bowled by Englands James Anderson during the s...


‘భారత్ జట్టు తరఫున మళ్లీ నేను త్వరలోనే పునరాగమనం చేస్తాను. తాజా వేటుతో నేనేమీ విశ్వాసం కోల్పోలేదు. బ్యాటింగ్‌లో కొన్ని తప్పిదాలను దిద్దుకోవాల్సి ఉంది. వాటిని వీలైనంత త్వరగా దిద్దుకుని ఫామ్ అందుకుంటా. జట్టులో వేటు పడటం నా కెరీర్‌లో ఇదేమీ తొలిసారి కాదు. ఇంగ్లాండ్‌ బౌలర్లు పక్కా వ్యూహంతో నా శరీరంపైకి బంతులు విసురుతూ వికెట్ తీశారు. ఇక వయసు అనేది కేవలం ఓ అంకె మాత్రమే. నా శక్తిమేరకు క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు తాజా టెస్టు సిరీస్‌ గెలవాలని ఆశిస్తున్నా’ అని మురళీ విజయ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.