టీ20ల్లో నేను కూడా త్వరలోనే సెంచరీ కొడతా: సంజు శాంసన్ ధీమా
Sanju Samson ఎట్టకేలకి అంతర్జాతీయ టీ20ల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 2015 నుంచి టీ20ల్లో ఆడుతున్న ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్.. ఐర్లాండ్పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడేశాడు.
ప్రధానాంశాలు:
- ఐర్లాండ్పై సంజు శాంసన్ హాఫ్ సెంచరీ
- దీపక్ హుడాతో 176 పరుగుల భాగస్వామ్యం
- టీ20 కెరీర్లో సంజుకి ఇదే మొదటి 50
- మ్యాచ్లో 4 భారీ సిక్సర్లు కొట్టిన సంజు
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున తాను కూడా త్వరలోనే సెంచరీ సాధిస్తానని సీనియర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ ధీమా వ్యక్తం చేశాడు. ఐర్లాండ్తో మంగళవారం డబ్లిన్ వేదికగా ముగిసిన రెండో టీ20 మ్యాచ్లో ఓపెనర్గా ఆడిన సంజు శాంసన్ 42 బంతుల్లో 9x4, 4x6 సాయంతో 77 పరుగులు చేశాడు. 2015 నుంచి టీ20ల్లో ఆడుతున్న సంజు శాంసన్కి ఇది 14వ మ్యాచ్కాగా.. కెరీర్లో ఇదే ఫస్ట్ అంతర్జాతీయ అర్ధశతకం. అయితే.. త్వరలోనే సెంచరీ కూడా సాధిస్తానని సంజు చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం జట్టులోకి సంజు శాంసన్ ఎంపికైనా.. తొలి టీ20లో అతనికి ఆడే అవకాశం దక్కలేదు. కానీ.. రెండో టీ20కి గాయం కారణంగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూరమవగా.. సంజు శాంసన్కి ఛాన్స్ దక్కింది. దాంతో.. ఓపెనర్గా ఆడిన సంజు ఫస్ట్ బాల్కే బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ తర్వాత దీపక్ హుడా (104: 57 బంతుల్లో 9x4, 6x6) దూకుడుగా ఆడటంతో.. కాస్త నెమ్మదించిన సంజు శాంసన్ అతనికి స్ట్రైక్ రొటేట్ చేసేందుకు పరిమితమయ్యాడు. కానీ.. హుడా హాఫ్ సెంచరీ తర్వాత నెమ్మదించగానే సంజు శాంసన్ గేర్ మార్చి ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. మరీ ముఖ్యంగా.. స్పిన్నర్ల బౌలింగ్లో బ్యాక్ఫుట్పైకి వెళ్లి మరీ సంజు సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో దీపక్ హుడాతో కలిసి రెండో వికెట్కి 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
మ్యాచ్లో భారత్ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచి.. రెండు టీ20ల సిరీస్ని 2-0తో కైవసం చేసుకుంది. ‘‘దీపక్ హుడా నా పనిని చాలా సులువు చేశాడు. బ్యాటింగ్ సమయంలో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంది. హుడా హిట్టింగ్ చేస్తున్నప్పుడు నేను అతనికి స్ట్రైక్ ఇస్తూ వచ్చాను. ఆ తర్వాత నేను దూకుడు పెంచగానే హుడా నాకు స్ట్రైక్ ఇస్తూ వచ్చాడు. హుడాతో 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఆనందంగా ఉంది. నేను కూడా త్వరలోనే సెంచరీ సాధిస్తాను. ఇప్పటికైతే 77 పరుగులు చేయడం పట్ల సంతోషంగా ఉన్నా’’ అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ రోహిత్ శర్మ, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, దీపక్ హుడా మాత్రమే సెంచరీలు నమోదు చేశారు.
మ్యాచ్లో భారత్ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచి.. రెండు టీ20ల సిరీస్ని 2-0తో కైవసం చేసుకుంది. ‘‘దీపక్ హుడా నా పనిని చాలా సులువు చేశాడు. బ్యాటింగ్ సమయంలో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంది. హుడా హిట్టింగ్ చేస్తున్నప్పుడు నేను అతనికి స్ట్రైక్ ఇస్తూ వచ్చాను. ఆ తర్వాత నేను దూకుడు పెంచగానే హుడా నాకు స్ట్రైక్ ఇస్తూ వచ్చాడు. హుడాతో 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఆనందంగా ఉంది. నేను కూడా త్వరలోనే సెంచరీ సాధిస్తాను. ఇప్పటికైతే 77 పరుగులు చేయడం పట్ల సంతోషంగా ఉన్నా’’ అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ రోహిత్ శర్మ, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, దీపక్ హుడా మాత్రమే సెంచరీలు నమోదు చేశారు.