యాప్నగరం

భారత్- ఆస్ట్రేలియా ఫైనల్లో ఢీకొంటాయి..?

. ఒకవేళ స్పిన్‌కి అనుకూలిస్తే.. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పండగ చేసుకుంటారు. టోర్నీలోని ఏ జట్టు‌కూ ఇలాంటి సమర్థ స్విన్

TNN 13 May 2017, 5:00 pm
ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా మూడు వారాలు గడువు ఉండగానే అప్పుడే విజేతపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడనున్న ఈ టోర్నీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఆస్ట్రేలియా తలపడతాయని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. జూన్ 1 నుంచి ఈ టోర్నీ ఆరంభమవనుండగా.. ఫైనల్ మ్యాచ్ జూన్ 18న జరగనుంది. ఐపీఎల్‌‌లో విరాట్ కోహ్లి, అజింక్య రహానె బ్యాట్‌తో నిరాశపరుస్తున్నా.. ఛాంపియన్స్ ట్రోఫీలో వారి పేలవ ఫామ్‌ భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపబోదని క్లార్క్ వివరించారు. అక్కడి వాతావరణం పేస్, స్వింగ్‌కి అనుకూలిస్తే ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందని.. ఒకవేళ స్పిన్‌కి అనుకూలిస్తే భారత్‌దే పైచేయి అవుతుందని ఈ మాజీ కెప్టెన్ అంచనా వేశారు.
Samayam Telugu icc champions trophy 2017 india and australia will play final feels michael clarke
భారత్- ఆస్ట్రేలియా ఫైనల్లో ఢీకొంటాయి..?


‘ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడతాయని నా నమ్మకం. అక్కడి పరిస్థితులు కూడా మ్యాచ్‌లపై ప్రభావం చూపుతాయి. పేస్, స్వింగ్‌కి సహకారం లభిస్తే మిచెల్ స్టార్క్, పాటిన్సన్, హేజిల్‌వుడ్, కమిన్స్ తదితర ఆస్ట్రేలియా పేసర్లను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కి కష్టమవుతుంది. ఒకవేళ స్పిన్‌కి అనుకూలిస్తే.. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పండగ చేసుకుంటారు. టోర్నీలోని ఏ జట్టు‌కూ ఇలాంటి సమర్థ స్విన్ జోడీ లేదు. ఐపీఎల్‌తో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఇన్నింగ్స్ నిర్మించేందుకు చాలా సమయం ఉంటుంది కాబట్టి విరాట్ కోహ్లి, రహానె ఫామ్‌పై భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని క్లార్క్ వివరించాడు. జూన్ 4న పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లోనే భారత్ ఢీకొంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.