యాప్నగరం

ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ వైస్ కెప్టెన్..?

మ్యాచ్ మధ్యలో కోహ్లికి ఏమైనా సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ధోనీ ఉన్నాడని.. అయితే అతను వైస్ కెప్టెన్ కాదని

TNN 24 May 2017, 5:33 pm
ఇంగ్లాండ్‌లో జూన్ 1 నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టును ప్రకటించిన సెలక్టర్లు ఇప్పటికీ వైస్ కెప్టెన్‌ ఎవరో చెప్పకుండా నాన్చుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడంతో అప్పటి వరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి ఎలాంటి చర్చ లేకుండానే టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. కానీ.. కోహ్లి ఏదైనా కారణాలతో మైదానంలో లేనప్పుడు నాయకత్వ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారంటే మౌనమే సమాధానం అవుతోంది.
Samayam Telugu icc champions trophy 2017 rohit sharma could act as vice captain of team india
ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ వైస్ కెప్టెన్..?

టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానె పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా ఆ బాధ్యతలు నిర్వహిస్తాడేమో కదా అనుకుంటే.. ఇప్పటి వరకు రహానె వన్డే, టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేదు. గత ఏడాది చాలా మ్యాచ్‌లకి రహానె తుది జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లి తర్వాత జట్టులో ఎవరు..? అనే ప్రశ్న మొదలవుతోంది. టోర్నీ మధ్యలో కోహ్లి గాయపడితే.. అప్పటికప్పుడు వైస్ కెప్టెన్‌ని ప్రకటించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మ్యాచ్ మధ్యలో కోహ్లికి ఏమైనా సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ధోనీ ఉన్నాడని.. అయితే అతను వైస్ కెప్టెన్ కాదని ఓ అధికారి తెలిపారు. ఇటీవల ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ని టైటిల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించే యోచనలో బీసీసీఐ ఉందని.. టోర్నీ ఆరంభంలో లోపు లేదా మధ్యలో ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు ఆయన వివరించారు. ఇంగ్లాండ్‌కి భారత్ జట్టుతో సెలక్టర్లు కూడా వెళ్తున్న నేపథ్యంలో అత్యవసరం సమయంలో వారే వైస్ కెప్టెన్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.