యాప్నగరం

రోహిత్, కేదార్ జాదవ్ ఇంగ్లాండ్‌కి వెళ్లలేదు..?

భారత్ జట్టు బుధవారం ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లింది. కానీ.. జట్టులోని ఇద్దరు ప్రధాన క్రికెటర్లు మాత్రం

TNN 25 May 2017, 5:43 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడేందుకు విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని భారత్ జట్టు బుధవారం ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లింది. కానీ.. జట్టులోని ఇద్దరు ప్రధాన క్రికెటర్లు మాత్రం వ్యక్తిగత కారణాలతో విమానం ఎక్కని విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం ముగిసిన ఐపీఎల్ ఫైనల్లో కెప్టెన్‌గా ముంబయి ఇండియన్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. తన కజిన్ వివాహం ఉండటంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకోగా.. వీసా మంజూరులో జాప్యం కారణంగా కేదార్ జాదవ్ భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వీరిద్దరూ శుక్రవారం ఇంగ్లాండ్‌కి బయల్దేరనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu icc champions trophy 2017 visa wedding delay kedar jadhav and rohit sharmas departures
రోహిత్, కేదార్ జాదవ్ ఇంగ్లాండ్‌కి వెళ్లలేదు..?


‘చాలా రోజుల క్రితమే రోహిత్ శర్మ తన కజిన్ వివాహ విషయాన్ని బీసీసీఐకి చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్నాడు. ఇక జాదవ్ వీసా క్లియరెన్స్ కోసం బుధవారం సాయంత్రం వరకూ ఎదురుచూశాం. కానీ.. ఫలితం లేకపోయింది. అయితే గురువారం అతని వీసా సమస్యలు తొలగిపోయాయి. కాబట్టి ఇద్దరు క్రికెటర్లు శుక్రవారం ఇంగ్లాండ్‌కి బయల్దేరుతారు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.