యాప్నగరం

టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో మార్పుల్లేవ్..!

క్రికెట్ అభిమానులకి శుభవార్త. ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయబోవట్లేదని ఐసీసీ తెలిపింది.

Samayam Telugu 6 Apr 2020, 7:37 pm
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయబోవట్లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా వరల్డ్‌కప్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ.. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టోర్నీ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.
Samayam Telugu T2O WORLD CUP


Read More: ఐపీఎల్‌లో ధోనీ ముందు మలింగ పప్పులుడకవ్..!

‘‘ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. టీ20 వరల్డ్‌కప్ నిర్వహణకి అనువైన మార్గాల్ని అక్కడి స్థానిక కమిటీ సూచించింది. దీంతో.. షెడ్యూల్ ప్రకారమే టీ20 వరల్డ్‌కప్ అక్టోబరు- నవంబరులో జరుగుతుంది. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని ఏడు స్టేడియాల్లో టోర్నీ నిర్వహణకి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించబోతున్నాం’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Read More: వరల్డ్‌కప్‌కి టైముంది కాస్త ఆగండి: రోహిత్ శర్మ

మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదాపడగా.. ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. భారత్‌ తరహాలోనే ఆస్ట్రేలియాలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో పాజిటివ్ కేసులు 5వేలుకి చేరువకాగా.. ప్రజలు బాధ్యతతో వ్యవహరించకపోతే మరింతగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.