యాప్నగరం

టీ20 మ్యాచ్‌ల్లో ఇక డీఆర్‌ఎస్..!

అంపైర్ ఔట్ ఇచ్చిన అనంతరం బ్యాట్స్‌మెన్ అసహనం ప్రదర్శిస్తే.. తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలపై

TNN 25 May 2017, 8:16 pm
ఐసీసీ క్రికెట్ కమిటీ గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్టు, వన్డే ఫార్మాట్ తరహాలో ఇకపై టీ20 మ్యాచ్‌ల్లో కూడా అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)ని అమలు చేయాలనే ప్రతిపాదనను అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ ఆమోదించింది. రెండు రోజుల పాటు లండన్‌లో జరిగిన ఈ సమావేశంలో క్రికెట్ సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Samayam Telugu icc cricket committee recommends drs for all t20 internationals
టీ20 మ్యాచ్‌ల్లో ఇక డీఆర్‌ఎస్..!


అంపైర్ ఔట్ ఇచ్చిన అనంతరం బ్యాట్స్‌మెన్ అసహనం ప్రదర్శిస్తే.. తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలపై సుదీర్ఘంగా కమిటీలో చర్చించారట. బౌలర్ క్రీజు నోబాల్, బ్యాట్స్‌మెన్‌ నడుముకి పైగా ఎత్తులో ఫుల్ టాస్ వేస్తే.. రెండింటినీ ఒకే తరహాలో నోబాల్‌గా చూడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా చివరికి ముందు పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించారు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయం‌పై రివ్వ్యూకి వెళ్లి.. ఫలితం జట్టుకి వ్యతిరేకంగా వచ్చినా అప్పటి వరకు ఆ జట్టుకి ఉన్న రివ్వ్యూ అవకాశాల్లో కోత ఉండదట. అది కేవలం అంపైర్ కోరిన రివ్య్వూలాగానే భావిస్తారట.

‘క్రికెట్‌కి సంబంధించిన చాలా విషయాలను కమిటీలో చర్చించాం. కొత్త విధానాలను అమలు చేసేందుకు కమిటీ ఏకగ్రీవంగా ఒప్పుకుంది. ఒకప్పుడు డీఆర్‌ఎస్‌‌లో కచ్చితత్వం లేదని భారత్ నిరాకరించింది. కానీ.. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. రాబోవు ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై కూడా కమిటీ చర్చించింది’ అని కుంబ్లే వివరించాడు. కొత్త నిబంధనలు అక్టోబరు 1 నుంచి అమలులోకి రానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.