అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్లోకి మరో నాలుగు కొత్త జట్లు వచ్చి చేరాయి. అంతర్జాతీయ జట్లు గెలుపోటముల ఆధారంగా టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది. తాజాగా ఈ జాబితాలోకి నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్తో పాటు యూఏఈ జట్లు చేరాయి. దీంతో.. మొత్తం 16 జట్లకి ఇకపై ఐసీసీ ర్యాంకింగ్స్ ఇవ్వనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ జట్టు 122 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
నెదర్లాండ్స్ గత ఏడాది ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్షిప్లో గెలుపొంది వన్డేలకి అర్హత సాధించగా.. ఐసీసీ వరల్డ్కప్ క్వాలిఫయర్ 2018లో స్కాట్లాండ్, నేపాల్, యూఏఈ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో యూఏఈ 18 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలవగా.. స్కాంట్లాండ్ (28 పాయింట్లు), ఐర్లాండ్ (38), జింబాబ్వే (55) జట్లు యూఏఈ తర్వాత చివరి నుంచి మూడు స్థానాల్లో నిలిచాయి.
నెదర్లాండ్స్ గత ఏడాది ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్షిప్లో గెలుపొంది వన్డేలకి అర్హత సాధించగా.. ఐసీసీ వరల్డ్కప్ క్వాలిఫయర్ 2018లో స్కాట్లాండ్, నేపాల్, యూఏఈ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో యూఏఈ 18 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలవగా.. స్కాంట్లాండ్ (28 పాయింట్లు), ఐర్లాండ్ (38), జింబాబ్వే (55) జట్లు యూఏఈ తర్వాత చివరి నుంచి మూడు స్థానాల్లో నిలిచాయి.