యాప్నగరం

ఇంటర్నేషనల్ క్రికెట్‌ మ్యాచ్ ఆడాలంటే..? 15+ మాత్రమే అనుమతి

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సరికొత్త రూల్‌ని తెరపైకి తెచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇకపై యువ క్రికెటర్లు ఎంట్రీ ఇవ్వాలంటే టాలెంట్‌తో పాటు కనీస వయసు కూడా ఉండాల్సిందే.

Samayam Telugu 20 Nov 2020, 4:00 pm
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. ఆటగాళ్ల భద్రతని దృష్టిలో ఉంచుకుని వయసు నిబంధనని తాజాగా ఐసీసీ తెరపైకి తెచ్చింది. దాంతో.. ఇకపై 15 ఏళ్ల లోపు వయసు ఉన్న క్రికెటర్లు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లను ఆడేందుకు అనుమతించరు. సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఇలాంటి వయసు నిబంధన లేదు. దాంతో పాకిస్థాన్‌కి చెందిన హసన్ రజా కేవలం 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
Samayam Telugu ICC


ఇంటర్నేషనల్ స్థాయిలో ఇప్పటికే అండర్-19 ప్రపంచకప్‌ని ఐసీసీ రెగ్యులర్‌గా నిర్వహిస్తోంది. దాంతో.. ఈ టోర్నీలో 14 -19 ఏళ్ల లోపు క్రికెటర్లు ఆడుతుంటారు. కానీ.. తాజా వయసు నిబంధనతో ఇకపై 15 ఏళ్లు పైబడిన వారే ఆ టోర్నీలో ఆడనున్నారు. పురుషులతో పాటు మహిళల క్రికెట్‌లోనూ ఇవే నిబంధనల్ని వర్తించనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది.

క్రికెట్‌లో ఇటీవల ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా బౌన్సర్లని ఆశ్రయిస్తున్నారు. ఇక షార్ట్ పిచ్ బంతుల సంధించడం కూడా పరిపాటిగా మారిపోయింది. దాంతో.. గాయపడుతున్న ఆటగాళ్ల సంఖ్యా పెరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.