యాప్నగరం

టీ20 ర్యాంకింగ్స్‌లో షెఫాలికి చేజారిన నెం.1

టీ20 వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ నుంచి నిలకడగా రాణించిన షెఫాలి వర్మ ఫైనల్లో తడబడింది. దీంతో.. భారత్ జట్టు టైటిల్‌ని చేజార్చుకోగా.. షెఫాలి కూడా నెం. 1 ర్యాంక్‌ దూరమైంది.

Samayam Telugu 9 Mar 2020, 2:56 pm
ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ షెఫాలి వర్మ తన నెం.1 ర్యాంక్‌‌ని చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో కేవలం 2 పరుగులే చేసి ఔటైన షెఫాలి వర్మ ఒక్కసారిగా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఇదే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై హాఫ్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ (78 నాటౌట్: 54 బంతుల్లో 10x4) నెం.1 స్థానానికి ఎగబాకింది. తొలిసారి ఫైనల్ ఆడిన భారత్ జట్టు 85 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Samayam Telugu Melbourne: Indias Shafali Verma walks off after losing her wicket to Australia...


Read More:టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్ బోల్తా.. మళ్లీ ఆసీస్‌దే కప్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో 762 పాయింట్లతో మూనీ నెం.1 స్థానంలో నిలవగా.. తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌కి చెందిన సూజీ బేట్స్ 750 పాయింట్లతో నిలిచింది. ఇక మూడో స్థానంలో షెఫాలి వర్మ 744 పాయింట్లతో నిలవగా.. భారత్‌కే చెందిన ఓపెనర్ మంధాన (661 పాయింట్లు), జెమీమా (643) వరుసగా 7, 9వ స్థానాల్లో నిలిచారు.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌కి నిరాశే ఎదురైంది. దీప్తి శర్మ, రాధ యాదవ్, పూనమ్ యాదవ్ వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-5లో దీప్తి శర్మ 302 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో ఆడిన ప్రతిసారి ఫైనల్‌కి చేరిన ఆస్ట్రేలియా జట్టు.. ఐదోసారి విజేతగా నిలిచి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.