యాప్నగరం

టీ20 వరల్డ్‌కప్‌లో లంకపై భారత్ ఘనవిజయం

మహిళల టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని ఓడించిన భారత్ జట్టు.. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లను ఓడించి సెమీస్ చేరింది. ఈరోజు శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లోనూ అదేజోరుని కొనసాగించింది.

Samayam Telugu 29 Feb 2020, 12:41 pm
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే టోర్నీలో సెమీస్ బెర్తుని ఖాయం చేసుకున్న భారత్ జట్టు.. ఈరోజు శ్రీలంకతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. గ్రూప్-ఎలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఏకైక జట్టుగా నిలవడంతో పాటు పట్టికలోనూ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
Samayam Telugu Australia India Cricket Womens T20 World Cup


ఈరోజు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేయగలిగింది. భారత అగ్రశ్రేణి బౌలర్ రాధ యాదవ్ (4/23) దెబ్బకి వరుస వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఆఖర్లో కవిశా దిహారి (25: 16 బంతుల్లో 2x4) భారత బౌలర్లకి ఎదురునిలిచి ఆ జట్టు పరువు నిలిపింది. ఆ జట్టులో ఓపెనర్ చమారి ఆటపట్టు (33: 24 బంతుల్లో 5x4, 1x6) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

114 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కి ఓపెనర్లు మంధాన (17: 12 బంతుల్లో 3x4), షపాలి వర్మ (47: 37 బంతుల్లో 7x4, 1x6) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ (15: 14 బంతుల్లో 2x4, 1x6), జెమీమా (15 నాటౌట్: 15 బంతుల్లో 1x4), దీప్తి శర్మ (15 నాటౌట్: 13 బంతుల్లో 2x4) కూడా దూకుడుగా ఆడేశారు. దీంతో.. కేవలం 14.4 ఓవర్లలోనే భారత్ జట్టు 116/3తో లక్ష్యాన్ని ఛేదించేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.